BUS and Lorry Accident | కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు.. ఐదుగురి పరిస్థితి విషమం
BUS and Lorry Accident | కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిపై బల్వంతపూర్ అడ్డ రోడ్డు వద్ద సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 20 మందికిపైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.
- 20 మందికి పైగా గాయాలు
- బాధితుల్లో ఐదుగురు చిన్నారులు సహా పలువురు మహిళలు
త్రినేత్ర.న్యూస్: కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిపై బల్వంతపూర్ అడ్డ రోడ్డు వద్ద సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 20 మందికిపైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంతో లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోగా ఆయనతో పాటు గాయపడిన ప్రయాణికులను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. మల్యాల సీఐ రాజ్కుమార్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్-1 డిపోకు చెందిన బస్సు సుమారు 60 మందికిపైగా ప్రయాణికులతో వరంగల్ నుండి నిజామాబాద్ వైపునకు వెళ్తోంది. కొండగట్టు సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు, లారీ ముందు భాగాలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోగా స్థానికులు, వాహనదారులు శ్రమించి బయటకు తీశారు. ఆయనతోపాటు గాయపడిన వారిని హుటాహుటిన జగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదం కారణంగా జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీంతోపాటు ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు. విచారణ అనంతరం ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
సంబంధిత వార్తలు

Ponguleti Srinivas Reddy | హక్కుదారులకు హామీ ఇస్తున్నా.. 22ఎ వల్ల గజం భూమిని కూడా పోనివ్వం
ఆగస్టు 17, 2026

Harish Rao | రేవంత్.. నీకు దమ్ముంటే నా పేరెత్తి మాట్లాడు.. నాకు భయపడే ఇన్డైరెక్ట్గా ఆరోపణలు చేస్తున్నవ్
ఆగస్టు 17, 2026

CP Sumathi | కాళ్లు, పొట్టకు హషీష్ ఆయిల్ ప్యాకెట్లు కట్టుకున్నారు.. ఎత్తుగడలు వేసి చిక్కిపోయారు
ఆగస్టు 17, 2026
తాజావార్తలు
- ●Khajaguda U Turn | ఖాజాగూడ రూట్లో వెళ్తున్నారా? ట్రాఫిక్ రూల్స్లో కీలక మార్పులు.. జాయింట్ సీపీ ఆకస్మిక తనిఖీలు
- ●Telangana CEO Sudharsan Reddy | SIR డ్రాఫ్ట్ రిలీజ్ చేయగానే అన్ని రాజకీయ పార్టీలను మీటింగ్కు పిలిచిన ఈసీ.. ఎందుకంటే?
- ●Ponguleti Srinivas Reddy | హక్కుదారులకు హామీ ఇస్తున్నా.. 22ఎ వల్ల గజం భూమిని కూడా పోనివ్వం
- ●Telangana employees JAC | తెలంగాణ సర్కార్పై పోరుకు సిద్ధమవుతున్న ఉద్యోగులు.. పీఆర్సీ, డీఏల సాధన కోసం రేపే కీలక భేటీ
- ●Kalyana Lakshmi Scheme Stopped | 50 లక్షల లాయర్ నీకు ఓకే.. ఆడబిడ్డలకు వద్దా? సీఎం రేవంత్పై హరీశ్ రావు ఫైర్
- ●Harish Rao | రేవంత్.. నీకు దమ్ముంటే నా పేరెత్తి మాట్లాడు.. నాకు భయపడే ఇన్డైరెక్ట్గా ఆరోపణలు చేస్తున్నవ్

Khajaguda U Turn | ఖాజాగూడ రూట్లో వెళ్తున్నారా? ట్రాఫిక్ రూల్స్లో కీలక మార్పులు.. జాయింట్ సీపీ ఆకస్మిక తనిఖీలు

Telangana CEO Sudharsan Reddy | SIR డ్రాఫ్ట్ రిలీజ్ చేయగానే అన్ని రాజకీయ పార్టీలను మీటింగ్కు పిలిచిన ఈసీ.. ఎందుకంటే?

Ponguleti Srinivas Reddy | హక్కుదారులకు హామీ ఇస్తున్నా.. 22ఎ వల్ల గజం భూమిని కూడా పోనివ్వం

Telangana employees JAC | తెలంగాణ సర్కార్పై పోరుకు సిద్ధమవుతున్న ఉద్యోగులు.. పీఆర్సీ, డీఏల సాధన కోసం రేపే కీలక భేటీ



