త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana CEO Sudharsan Reddy | SIR డ్రాఫ్ట్ రిలీజ్ చేయగానే అన్ని రాజకీయ పార్టీలను మీటింగ్‌కు పిలిచిన ఈసీ.. ఎందుకంటే?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. 2.65 కోట్ల ఫారాలు సేకరించిన ఈసీ, సెప్టెంబర్ 16 వరకు తప్పుల సవరణకు అవకాశం కల్పించింది.

J

Telangana | Published On Aug 17, 2026, 7.56 pm IST

Telangana CEO Sudharsan Reddy | SIR డ్రాఫ్ట్ రిలీజ్ చేయగానే అన్ని రాజకీయ పార్టీలను మీటింగ్‌కు పిలిచిన ఈసీ.. ఎందుకంటే?
Advertisement
  • తెలంగాణ SIR-2026లో భాగంగా ఇంటింటి ఎన్యుమరేషన్ (సర్వే) పూర్తి చేసి, ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన ఎన్నికల సంఘం
  • రాష్ట్ర వ్యాప్తంగా 78.30 శాతం (సుమారు 2.65 కోట్లు) ఎన్యుమరేషన్ ఫారాలను సేకరించినట్లు సీఈఓ సి. సుదర్శన్ రెడ్డి వెల్లడి
  • ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఓటరు నమోదు, అభ్యంతరాల (Claims and Objections) స్వీకరణ
  • అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించి, లోప రహిత జాబితా రూపకల్పనకు సహకరించాలని రాజకీయ పార్టీలకు సీఈఓ పిలుపు

Telangana CEO Sudharsan Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో రాబోయే ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను (Draft Electoral Roll) రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి సోమవారం విడుదల చేశారు. అనంతరం హైదరాబాద్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆయన, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR-2026) ముఖ్యాంశాలను పంచుకున్నారు.

పూర్తయిన ఎన్యుమరేషన్.. 78 శాతం ఫారాల సేకరణ

రాష్ట్రవ్యాప్తంగా జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించిన 'ఎన్యుమరేషన్ ఫేజ్' (Enumeration Phase) విజయవంతంగా పూర్తయిందని సీఈఓ తెలిపారు. ఈ ఇంటింటి సర్వేలో మొత్తం ఓటర్లలో 78.30 శాతం, అంటే సుమారు 2.65 కోట్ల ఎన్యుమరేషన్ ఫారాలను (EFs) సిబ్బంది సేకరించినట్లు వెల్లడించారు.

Telangana Draft Voter List 2026 Released Check Crucial Updates

ఈ సర్వే ద్వారా చనిపోయినవారు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, అసలు అందుబాటులో లేని ఓటర్లు, అలాగే డబుల్ ఓట్లు (ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైనవి) ఉన్న వారి వివరాలను పక్కాగా గుర్తించి వేరు చేసినట్లు పార్టీల ప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చారు.

సెప్టెంబర్ 16 వరకు తప్పుల సవరణకు చాన్స్

ఓటర్ల జాబితాలో మీ పేరు లేకపోయినా, లేదా చిరునామా, పేర్లలో తప్పులున్నా సవరించుకునేందుకు ఈసీ ఒక నెల రోజుల పాటు అవకాశం కల్పించింది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు 'క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్' (Claims and Objections) ప్రక్రియ కొనసాగుతుందని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముసాయిదా ఓటర్ల జాబితాను ఒక హార్డ్ డిస్క్ (Hard Disk) రూపంలో అందజేశారు.

Telangana Draft Voter List 2026 Released Check Crucial Updates

పారదర్శకత కోసమే..

ఈ మీటింగ్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా SIR ప్రక్రియ పూర్తి వివరాలను వివరించిన సీఈఓ.. రాజకీయ పార్టీల నేతలు అడిగిన పలు ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. అర్హత కలిగిన ఏ ఒక్క పౌరుడి ఓటు మిస్ కాకుండా చూడాలని కోరారు. ఓటర్ల జాబితా వంద శాతం పారదర్శకంగా, లోప రహితంగా (Error-free) ఉండేలా చూడటానికి 'క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్' ప్రక్రియలో రాజకీయ పార్టీలు కూడా చురుకుగా పాల్గొని సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కీలక సమావేశంలో అదనపు సీఈఓ డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ అదనపు కార్యదర్శి ఎన్. శంకర్, డిప్యూటీ సీఈఓ (FAC) జి.ఎస్. చారి తదితర ఐటీ, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement