త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Udhayanidhi Stalin | త్రిష‌పై అస‌భ్య‌క‌ర కామెంట్స్‌.. ఉద‌య‌నిధి స్టాలిన్ అరెస్ట్‌

Udhayanidhi Stalin | త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ముఖ్య‌మంత్రి విజ‌య్‌, ప్ర‌ముఖ న‌టి త్రిష‌ను ఉద్దేశించి అస‌భ్య‌క‌ర కామెంట్స్ చేసిన ప్ర‌తిప‌క్ష‌నేత‌, డీఎంకే నేత‌, మాజీ మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

D

National | Published On Aug 4, 2026, 11.35 am IST

Udhayanidhi Stalin | త్రిష‌పై అస‌భ్య‌క‌ర కామెంట్స్‌.. ఉద‌య‌నిధి స్టాలిన్ అరెస్ట్‌
Advertisement

Udhayanidhi Stalin | త్రినేత్ర‌.న్యూస్ : త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ముఖ్య‌మంత్రి విజ‌య్‌, ప్ర‌ముఖ న‌టి త్రిష‌ను ఉద్దేశించి అస‌భ్య‌క‌ర కామెంట్స్ చేసిన ప్ర‌తిప‌క్ష‌నేత‌, డీఎంకే నేత‌, మాజీ మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ నిమిత్తం ఆయ‌న్ని పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఆయ‌న్ని స్టేష‌న్‌ను త‌ర‌లించే క్ర‌మంలో స్టాలిన్ నివాసం వ‌ద్ద డీఎంకే కార్య‌క‌ర్త‌లు, పోలీసుల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

కాగా, కావేరీ జ‌లాల వివాదం త‌మిళ‌నాడులో హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఈ అంశంపై (Cauvery protest) సోమ‌వారం తంజావూరులో జ‌రిగిన నిర‌స‌న‌ ర్యాలీలో ఉద‌య‌నిధి స్టాలిన్ పాల్గొని మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి విజ‌య్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. రైతుల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌టంలో టీవీకే ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ మండిప‌డ్డారు. ఆ స‌మ‌యంలో న‌టి త్రిష (actor Trisha)ను ఉద్దేశించి ద్వంద్వార్థం వ‌చ్చేలా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆ స‌మ‌యంలో డీఎంకే కార్య‌క‌ర్త‌లు త్రిష ప్ర‌స్తావ‌న తెచ్చారు. త్రిష‌, త్రిష అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారిని నిలువ‌రించాల్సిన ఉద‌య‌నిధి న‌వ్వుతూ త‌న ప్రసంగాన్ని కొన‌సాగించారు.

ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌పై టీవీకే నేత‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్ర‌తిప‌క్ష నేత వ్యాఖ్య‌లు మ‌హిళ‌ల గౌర‌వానికి భంగం క‌లిగించేలా ఉన్నాయంటూ టీవీకే మ‌హిళా విభాగం తంజావూరు తూర్పు పోలీసు స్టేష‌న్‌, జాతీయ మ‌హిళా క‌మిష‌న్‌కు అధికారికంగా ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు ఇవాళ ఉద‌యం చెన్నైలోని నీలాంకరై నివాసంలో ఉద‌య‌నిధిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, ఉదయనిధి ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మధ్యాహ్నం ఈ పిటిషన్‌పై విచారణ జరగ‌నుంది.

Also Read..

మార్ఫింగ్ చేస్తే జైలుకే - డీప్ ఫేక్‌ ఫొటోల‌పై మృణాల్ ఠాకూర్ వార్నింగ్

క్లోజింగ్ వేలం ఎఫెక్ట్.. నిఫ్టీకి భారీ షాక్, ఐటీ షేర్లపై ఒత్తిడి..

ఇస్త్రీ చేస్తుండ‌గా కాలిన షేర్వాణీ.. రూ. 14 వేలు జ‌రిమానా విధించిన కోర్టు

Advertisement
Advertisement