Supreme Court | న్యాయ వ్యవస్థలో ఏఐ వినియోగంపై సుప్రీం ఆందోళన.. నిర్ణయాధికారం పూర్తిగా మనుషుల నియంత్రణలోనే ఉండాలని స్పష్టీకరణ
Supreme Court | న్యాయ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) వినియోగంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఏఐ ఆధారిత నకిలీ తీర్పులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. న్యాయ ప్రక్రియలోని ప్రతి దశలోనూ నిర్ణయాధికారం పూర్తిగా మనుషుల నియంత్రణలోనే ఉండాలని నొక్కి చెప్పింది.
Supreme Court | న్యాయ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) వినియోగంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది న్యాయమూర్తులకు, న్యాయవాదులకు సహాయపడగలదే కానీ, అది మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాలేదని స్పష్టం చేసింది.
దివాలా వివాదానికి సంబంధించిన కేసులో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT), జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (NCLAT) ఇచ్చిన తీర్పును జస్టిస్ పీఎస్ నర్సింహా, అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. ఆర్టిఫిషియల్ ద్వారా సృష్టించిన, ఉనికిలో లేని నకిలీ అంశాలను.. గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులుగా భావించి ట్రిబ్యునల్ ఈ తీర్పు ఇచ్చిందని ధర్మాసనం గుర్తించింది.
ఏఐ ఆధారిత నకిలీ తీర్పులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ మేరకు NCLT ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. నిర్ణయాత్మక ప్రక్రియలో ఒకవేళ నకిలీ అంశం వస్తే, ఆ నిర్ణయాలను పక్కన పెట్టాలని కోర్టు స్పష్టం చేసింది. ఏఐ తీర్పులపై కఠినంగా వ్యవహరించాలని న్యాయస్థానాలకు సూచించింది. న్యాయ ప్రక్రియలోని ప్రతి దశలోనూ నిర్ణయాధికారం పూర్తిగా మనుషుల నియంత్రణలోనే ఉండాలని నొక్కి చెప్పింది. ఈ మేరకు న్యాయ ప్రక్రియలో ఏఐ వినియోగం వల్ల తలెత్తే సవాళ్లను పరిశీలించడానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI)ని ధర్మాసనం ఆదేశించింది.
Also Read..
నీట్ యూజీ ఫలితాలపై కీలక ప్రకటన చేసిన ఎన్టీఏ
అమర్నాథ్ మంచు శివలింగం వెనుక రహస్యమిదే..!
రూ. లక్ష కోట్లు తగ్గింది కదా..? మరి రాజీనామా చేయ్ జూపల్లి : హరీశ్రావు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Shah Rukh Khan | లాస్ ఏంజిల్స్లో నైట్ రైడర్స్ క్రికెట్ గ్రౌండ్.. ఆనందం వ్యక్తం చేసిన షారుఖ్ ఖాన్
- ●Vishwambhara | షూటింగ్ పూర్తయిన ఏడాది తర్వాత థియేటర్లలోకి చిరంజీవి మూవీ - పదేళ్ల తర్వాత త్రిష కమ్బ్యాక్
- ●Interstate drug gang arrest | స్పీడ్ పోస్ట్ల్లో గంజాయి దందా.. హైదరాబాద్లో చిక్కిన అంతర్రాష్ట్ర ముఠా
- ●SBI Funds IPO | పెట్టుబడిదారులకు భారీ శుభవార్త.. ఎస్బీఐ ఫండ్స్ భారీ ఐపీఓ వస్తోంది..
- ●Harish Rao | చర్చకు సిద్ధమైతే.. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు..? : హరీశ్రావు
- ●HUAWEI Band 11 Series | రూ.3,999కే హువావే కొత్త స్మార్ట్ బ్యాండ్లు.. 14 రోజుల బ్యాటరీ బ్యాకప్..

Shah Rukh Khan | లాస్ ఏంజిల్స్లో నైట్ రైడర్స్ క్రికెట్ గ్రౌండ్.. ఆనందం వ్యక్తం చేసిన షారుఖ్ ఖాన్

Vishwambhara | షూటింగ్ పూర్తయిన ఏడాది తర్వాత థియేటర్లలోకి చిరంజీవి మూవీ - పదేళ్ల తర్వాత త్రిష కమ్బ్యాక్

Interstate drug gang arrest | స్పీడ్ పోస్ట్ల్లో గంజాయి దందా.. హైదరాబాద్లో చిక్కిన అంతర్రాష్ట్ర ముఠా

SBI Funds IPO | పెట్టుబడిదారులకు భారీ శుభవార్త.. ఎస్బీఐ ఫండ్స్ భారీ ఐపీఓ వస్తోంది..






