Harish Rao | చర్చకు సిద్ధమైతే.. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు..? : హరీశ్రావు
Harish Rao | ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై మీడియా సమక్షంలో ప్రజల సాక్షిగా చర్చిద్దామంటే.. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ప్రశ్నించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాదు.. గన్పార్కుకు రావాలని మంత్రులు అంటే.. అక్కడికి వెళ్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై మీడియా సమక్షంలో ప్రజల సాక్షిగా చర్చిద్దామంటే.. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ప్రశ్నించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాదు.. గన్పార్కుకు రావాలని మంత్రులు అంటే.. అక్కడికి వెళ్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు. తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
ముఖ్యంగా ప్రభుత్వ, గురుకుల పాఠశాలల టెండర్లకు సంబంధించి రూ. 2 వేల కోట్ల విలువైన టెండర్లు జరిగాయి. ఈ టెండర్లలో అవినీతి, అక్రమాలు జరిగాయి. బలహీన వర్గాల పిల్లలకు అన్యాయం జరిగిందని నేను, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కొప్పుల ఈశ్వర్ మాట్లాడినం. చర్చకు సిద్ధమని అనేకసార్లు చెప్పి చివరకు మంత్రులు తోక ముడిచారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్కు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు వస్తున్నా మీరు రండి అని ఆర్ఎస్పీ సవాల్ విసిరారు. మరి ఎందుకు రాలేదు మంత్రులు. ట్విస్ట్ ఇచ్చారు.. ఆర్ఎస్పీతో మాట్లాడం హరీశ్రావు వస్తేనే మాట్లాడుతం అని ట్విస్ట్ ఇచ్చారు. నా నియోజకవర్గంలో నాకు ప్రొగ్రామ్స్ ఉండే.. అయినా కూడా నేను వచ్చాను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పోదామని హరీశ్రావు తెలిపారు.
గన్ పార్కుకు రానివ్వాలి కదా..?
ప్రజల కోసం బేషజాలు అవసరం లేదని చెప్పి మంత్రులు పిలిచిన వద్దకే వెళ్దామని బయల్దేరాం. మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు. హిట్లరే మార్గదర్శకమన్న ముఖ్యమంత్రి ఆయనే హోం మంత్రి. మంత్రుల సవాల్ నిజమైతే, చర్చకు సిద్ధమైతే మమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు.. గన్ పార్కుకు రానివ్వాలి కదా..? ప్రజల కోసం రెండు అడుగులు వెనక్కి తగ్గి.. ముందుకు వెళ్లే అడ్డుకున్నారు. ముగ్గురు మంత్రులకు ఫోన్లు చేస్తే ఎత్తలేదు అని హరీశ్రావు మండిపడ్డారు.
కుండ బద్దలు కొట్టినట్టు ఖుల్లం ఖుల్లా
పోలీసు అధికారులకు చెప్పాం మంత్రులు పిలిచారని.. కొట్లాటకు వెళ్లడం లేదు చర్చకు పోతున్నామని చెప్పాం. మంత్రుల సవాల్ను స్వీకరించి వెళ్తున్నామంటే.. అరెస్టు చేసి పీఎస్లో పెట్టారు. దీంతో చర్చకు మీరు సిద్ధంగా లేరని, టెండర్లలో అవినీతి జరిగిందని స్పష్టమైంది. మమ్మల్ని అరెస్టు చేసి తప్పించుకున్నారు. కంచన్బాగ్ పీఎస్కు రండి అని పిలుపునిచ్చాం. అక్కడ కూడా కుర్చీ ఏర్పాటు చేశాం.. ఇక్కడ కూడా చర్చించడానికి సిద్ధం అని చెప్పాం. పోలీసు పహారాలో సెక్రటేరియల్, గన్ పార్కు అసెంబ్లీకి తీసుకెళ్లండి అని ప్రభుత్వానికి, పోలీసులకు విజ్ఞప్తి చేశాం. అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదు.. అవినీతిపై సమాధానం చెప్పలేక తోక ముడిచి పారిపోయిందని అర్థమవుతుంది. చాటుకు మాట్లాడుడు ఎందుకు మీడియా, ప్రజల సాక్షిగా కుండ బద్దలు కొట్టినట్టు ఖుల్లం ఖుల్లా మాట్లాడుకుందామంటే ఎందుకు పోలీసులను అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారు. ప్రభుత్వం అవినీతికి పాల్పడింది కాబట్టే పోలీసులను అడ్డం పెట్టుకుని చర్చ లేకుండా పారిపోయారు అని హరీశ్రావు నిప్పులు చెరిగారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao | రూ.1,142 కోట్లు, రూ.800 కోట్లు కలిపితే దాదాపు రూ.2,000 కోట్లే కదా? మంత్రి అడ్లూరిని నిలదీసిన హరీశ్రావు
జులై 2, 2026

Harish Rao | రూ. లక్ష కోట్లు తగ్గింది కదా..? మరి రాజీనామా చేయ్ జూపల్లి : హరీశ్రావు
జులై 2, 2026

Lakshmi Bai | ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు షాక్.. సతీమణి లక్ష్మీభాయి బదిలీ
జులై 2, 2026
తాజావార్తలు
- ●Kacheguda Railway Station | 110 ఏళ్లు పూర్తి చేసుకున్న కాచిగూడ రైల్వే స్టేషన్.. వారసత్వాన్ని కాపాడుకుంటూ ఆధునికీకరణలో ముందంజ
- ●TGPSC | నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ
- ●Tummala Nageshwar Rao | 4 ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల : మంత్రి తుమ్మల
- ●Indian Navy | భారత్ కార్గో షిప్ని హైజాక్ చేసేందుకు సముద్రపు దొంగల యత్నం.. అందులో ఏముందంటే?
- ●Harish Rao | రూ.1,142 కోట్లు, రూ.800 కోట్లు కలిపితే దాదాపు రూ.2,000 కోట్లే కదా? మంత్రి అడ్లూరిని నిలదీసిన హరీశ్రావు
- ●Shah Rukh Khan | లాస్ ఏంజిల్స్లో నైట్ రైడర్స్ క్రికెట్ గ్రౌండ్.. ఆనందం వ్యక్తం చేసిన షారుఖ్ ఖాన్

Kacheguda Railway Station | 110 ఏళ్లు పూర్తి చేసుకున్న కాచిగూడ రైల్వే స్టేషన్.. వారసత్వాన్ని కాపాడుకుంటూ ఆధునికీకరణలో ముందంజ

TGPSC | నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ

Tummala Nageshwar Rao | 4 ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల : మంత్రి తుమ్మల

Indian Navy | భారత్ కార్గో షిప్ని హైజాక్ చేసేందుకు సముద్రపు దొంగల యత్నం.. అందులో ఏముందంటే?



