Harish Rao | రూ. లక్ష కోట్లు తగ్గింది కదా..? మరి రాజీనామా చేయ్ జూపల్లి : హరీశ్రావు
Harish Rao | రాష్ట్ర అప్పుల విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడిన మాటలకు నిన్నటికి, ఇవాళ్టికి లక్ష కోట్లు తగ్గింది కదా..? ఆయనకు పాలమూరు పౌరుషం, చీము నెత్తురు ఉంటే తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు డిమాండ్ చేశారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర అప్పుల విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడిన మాటలకు నిన్నటికి, ఇవాళ్టికి లక్ష కోట్లు తగ్గింది కదా..? ఆయనకు పాలమూరు పౌరుషం, చీము నెత్తురు ఉంటే తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు డిమాండ్ చేశారు. కంచన్బాగ్ పోలీసు నుంచి నేరుగా తెలంగాణ భవన్కు చేరుకుని హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో రూ. 8 లక్షల కోట్ల అప్పు చేయలేదని రుజువు చేస్తే అక్కడే రాజీనామా చేస్తాను అని జూపల్లి కృష్ణారావు చెప్పారు. మరి ఎందుకు తెలంగాణ భవన్కు ఎందుకు రాలేదు. భవన్లో కేటీఆర్ వేదిక సిద్ధం చేసి పెడితే ఆయన తోక ముడిచారు. జూపల్లికి పాలమూరు పౌరుషం, చీము, నెత్తురు ఉంటే తక్షణమే రాజీనామా చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 8 లక్షల కోట్ల అప్పు చేసిందని చూపిస్తానని అని ఇవాళ ఏడు లక్షల కోట్ల అప్పు చేసిందని అంటున్నాడు. చర్చ జరిగి ఉంటే ఇంకో 3 లక్షల కోట్లు తగ్గేది. మరి నిన్నటికి, ఇవాళ్టికి లక్ష కోట్లు తగ్గింది కదా.. నువ్వు రాజీనామా చేయ్ అని హరీశ్రావు డిమాండ్ చేశారు.
నా లెక్కలకు సభను వాయిదా వేసుకున్నారు..
జూపల్లికి సబ్జెక్టు లేక చర్చకు రాకుండా ముఖం చాటేశారు. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు కేటీఆర్.. నువ్వు స్పందించి నేనే భవన్కు వస్తా అని జూపల్లి అన్నారు. విషయం లేక తోక ముడిచారు. అసెంబ్లీ వేదికగా అప్పుల గురించి వివరంగా చెప్పి ఆనాడు ప్రభుత్వం నోరు మూయించాం. అప్పులపై మాట్లాడాని భట్టి విక్రమార్కకు సవాల్ విసిరితే.. నా లెక్కలకు, సవాల్కు చర్చకు రాకుండా ప్రభుత్వం సభను వాయిదా వేసుకుని పోయింది. కాంగ్రెస్ పార్టీకి వదేండ్ల చరిత్ర ఉంది.. డబ్బులు ఎలా సంపాదించాలో మాకు తెలుసు.. ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేయాలో తమకు తెలుసని భట్టి రెచ్చిపోయి మాట్లాడారు.. ఇవాళ అడుగుతుంటే.. బీఆర్ఎస్ మీద నెపం పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్రావు మండిపడ్డారు.
మళ్లీ అసెంబ్లీ పెట్టండి..
మళ్లీ అసెంబ్లీ పెట్టండి.. ఎక్కడైనా సరే చర్చించేందుకు సిద్ధంగా ఉంది బీఆర్ఎస్. విషయం లేక జూపల్లి తోక ముడిచారు. ఉదయం 10.30 నుంచి ఈ నిమిషం వరకు కూడా భవన్లోనే ఉన్నాం. కానీ జూపల్లి మాట మార్చి అమరవీరుల స్థూపం వద్ద ఉన్నా అంటే అక్కడి వెళ్తుంటే కేటీఆర్ను అడ్డుకున్నారని హరీశ్రావు తెలిపారు.
సంబంధిత వార్తలు

Harish Rao | అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను జడ్పీ చైర్మన్ చేసిందే మేమే : హరీశ్రావు
జులై 2, 2026

TGPSC | నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ
జులై 2, 2026

Tummala Nageshwar Rao | 4 ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల : మంత్రి తుమ్మల
జులై 2, 2026
తాజావార్తలు
- ●Sri Gouri Priya | వారం గ్యాప్లో రెండు సినిమాలు - మ్యాడ్ హీరోయిన్ మామూలు బిజీ కాదుగా!
- ●Kacheguda Railway Station | 110 ఏళ్లు పూర్తి చేసుకున్న కాచిగూడ రైల్వే స్టేషన్.. వారసత్వాన్ని కాపాడుకుంటూ ఆధునికీకరణలో ముందంజ
- ●TGPSC | నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ
- ●Tummala Nageshwar Rao | 4 ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల : మంత్రి తుమ్మల
- ●Indian Navy | భారత్ కార్గో షిప్ని హైజాక్ చేసేందుకు సముద్రపు దొంగల యత్నం.. అందులో ఏముందంటే?
- ●Harish Rao | రూ.1,142 కోట్లు, రూ.800 కోట్లు కలిపితే దాదాపు రూ.2,000 కోట్లే కదా? మంత్రి అడ్లూరిని నిలదీసిన హరీశ్రావు

Sri Gouri Priya | వారం గ్యాప్లో రెండు సినిమాలు - మ్యాడ్ హీరోయిన్ మామూలు బిజీ కాదుగా!

Kacheguda Railway Station | 110 ఏళ్లు పూర్తి చేసుకున్న కాచిగూడ రైల్వే స్టేషన్.. వారసత్వాన్ని కాపాడుకుంటూ ఆధునికీకరణలో ముందంజ

TGPSC | నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ

Tummala Nageshwar Rao | 4 ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల : మంత్రి తుమ్మల



