త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | అయోధ్య రామమందిరం విరాళాల కేసును రాజకీయం చేయొద్దు : సుప్రీంకోర్టు

Supreme Court | అయోధ్య‌లోని రామ మందిరంలో విరాళాల (Ayodhya temple donations) చోరీ అంశాన్ని రాజ‌కీయం చేయొద్ద‌ని సుప్రీంకోర్టు (Supreme Court) హిత‌వు ప‌లికింది. కోర్టులు రాజకీయాలకు వేదిక కాద‌ని పిటిష‌న‌ర్ల‌కు స్ప‌ష్టం చేసింది.

D

National | Published On Jul 20, 2026, 5.45 pm IST

Supreme Court | అయోధ్య రామమందిరం విరాళాల కేసును రాజకీయం చేయొద్దు : సుప్రీంకోర్టు
Advertisement

Supreme Court | దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన అయోధ్య‌లోని రామ మందిరంలో విరాళాల (Ayodhya temple donations) చోరీ అంశంపై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో ఇవాళ విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సుప్రీం ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ అంశాన్ని రాజ‌కీయం చేయొద్ద‌ని హిత‌వు ప‌లికింది. కోర్టులు రాజకీయాలకు వేదిక కాద‌ని పిటిష‌న‌ర్ల‌కు స్ప‌ష్టం చేసింది. స‌రైన ద‌ర్యాప్తు జరిగేలా చూస్తామ‌ని హామీ ఇచ్చింది.

అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీపై దాఖ‌లైన పిటిష‌న్ల‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ సూర్యకాంత్ (CJI Justice Surya Kant), జ‌స్టిస్ బాగ్చీ, జ‌స్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సంద‌ర్భంగా కేసు విచార‌ణ‌కు సిట్​ను ఏర్పాటు చేశారా..? అని యూపీ ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ‌తాను ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది. దీనికి ఆయ‌న బ‌దులిస్తూ.. ఈ కేసు దర్యాప్తునకు ఉత్తరప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వం సిట్​ను ఏర్పాటు చేసిందని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీసులు విచారణ చేస్తున్నారని వెల్లడించారు. ఈ మేర‌కు ద‌ర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్టును ధర్మాసనానికి సమర్పించారు. అనంత‌రం త‌దుప‌రి విచార‌ణ‌ను కోర్టు ఈనెల 27కు వాయిదా వేసింది.

Also Read..

బిగ్‌బాస్ బ్యూటీతో ఎన్నారై కుర్రాడి రొమాన్స్.. టాలీవుడ్‌కి కొత్త హీరో దొరికాడన్న దిల్ రాజు!

కృష్ణాలో నీళ్లు లేవు.. బోరింగ్‌ల‌ను రిపేర్ చేయండి

అధ్యాపకులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

Advertisement
Advertisement