త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vande Bharat | వందేభార‌త్‌లో నాసిర‌కం భోజ‌నం.. క‌స్ట‌మ‌ర్ ఫిర్యాదుతో ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షల జరిమానా

Vande Bharat | వందే భార‌త్ రైల్లో నాసిర‌కం భోజనం అందించారంటూ ఓ ప్ర‌యాణికుడు ఫిర్యాదు చేశాడు (Passenger Food Complaint). ఈ ఫిర్యాదును రైల్వే శాఖ చాలా సీరియ‌స్‌గా తీసుకుంది. ఈ మేర‌కు త‌న సొంత సంస్థ అయిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)కు భారీ జ‌రిమానా విధించింది.

D

National | Published On Mar 26, 2026, 12.29 pm IST

Vande Bharat | వందేభార‌త్‌లో నాసిర‌కం భోజ‌నం.. క‌స్ట‌మ‌ర్ ఫిర్యాదుతో ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షల జరిమానా
Advertisement

Vande Bharat | రైళ్లలో అందించే ఫుడ్ (Meals) క్వాలిటీపై ప్రయాణికుల నుంచి ఎప్పుడూ అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. భోజనం బాగోలేదనో, ఏవైనా పురుగులు పడటం వంటి ఫిర్యాదులు అందుతూనే ఉంటాయి. ఎన్ని ఫిర్యాదులు అందినా మార్పు మాత్రం రావడం లేదు. మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలే తరచూ పునరావృతం అవుతూ వ‌స్తున్నాయి. చివ‌రికి కేంద్రం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన వందేభార‌త్ రైళ్ల‌లోనూ ఇదే ప‌రిస్థితి. తాజాగా వందే భార‌త్ రైల్లో నాసిర‌కం భోజనం అందించారంటూ ఓ ప్ర‌యాణికుడు ఫిర్యాదు చేశాడు (Passenger Food Complaint). ఈ ఫిర్యాదును రైల్వే శాఖ చాలా సీరియ‌స్‌గా తీసుకుంది. ఈ మేర‌కు త‌న సొంత సంస్థ అయిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)కు భారీ జ‌రిమానా విధించింది.

ఇంత‌కీం ఏం జ‌రిగిందంటే..?

మార్చి 15వ తేదీన 21896 నంబర్ గల పాట్నా-టాటానగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఓ వ్యక్తి ప్ర‌యాణించాడు. ఆ స‌మ‌యంలో త‌న‌కు అందించిన ఆహార నాణ్యతపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఈ మేర‌కు రైల్వే శాఖ‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును తీవ్రంగా ప‌రిగ‌ణించిన రైల్వే శాఖ‌.. ఐఆర్‌సీటీసీకి రూ. 10 లక్షల జరిమానా విధించింది. అంతేకాదు, సదరు సర్వీస్ ప్రొవైడర్‌పై రూ. 50 లక్షల జరిమానా విధిస్తూ.. వారి కాంట్రాక్టును రద్దు చేయాలని ఆదేశించింది. ప్రయాణికుల భద్రత, నాణ్యతే తమ ప్రథమ ప్రాధాన్యత అని రైల్వేశాఖ స్ప‌ష్టం చేసింది. నాణ్య‌త విష‌యంలో రాజీప‌డేది లేద‌ని తెలిపింది.

మూడేళ్ల‌లో రూ. 2.6 కోట్ల జరిమానాలు..

భారత రైల్వే ఏటా దాదాపు 58 కోట్ల భోజనాలను ప్రయాణికులకు అందిస్తోంద‌ని మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది. వీటిలో ఫిర్యాదుల శాతం కేవలం 0.0008 శాతం మాత్రమేనని పేర్కొంది. ఈ ఫిర్యాదులపై విచార‌ణ జ‌రిపి.. గత మూడేళ్లలో మొత్తం రూ. 2.6 కోట్ల జరిమానాలు విధించిన‌ట్లు తెలిపింది. 2025వ సంవత్సరంలో ప్యాంట్రీ కార్ సిబ్బంది రైల్వే ప్రయాణికులపై దాడి చేసిన సంఘటనలు మూడు న‌మోదైన‌ట్లు పేర్కొంది. ఆ సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకున్న‌ట్లు తెలిపింది.

Also Read..

ఎంజీ యూనివ‌ర్సిటీలో నీటి సంక్షోభం.. నెల రోజులుగా విద్యార్థుల ఇబ్బందులు

న‌న్ను ఇరాన్ సుప్రీం లీడ‌ర్‌గా ఉండ‌మ‌న్నారు.. ట్రంప్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

ప్ర‌జాపాల‌న‌లో ఆరోగ్య‌శ్రీ ల‌బ్ధిదారులు 496 మందే : హ‌రీశ్‌రావు

Advertisement

తాజావార్తలు

Advertisement