త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ప్ర‌జాపాల‌న‌లో ఆరోగ్య‌శ్రీ ల‌బ్ధిదారులు 496 మందే : హ‌రీశ్‌రావు

Harish Rao | ఈ రెండున్న‌రేండ్ల ప్ర‌జాపాల‌న‌లో ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం కింద 496 మందే ల‌బ్ధి పొందిన‌ట్లు బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు తెలిపారు. ఈ ప‌థ‌కం కింద రూ. 5 ల‌క్ష‌ల నుంచి రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కు పెంచినా కూడా ఎందుకు ఎక్కువ మంది ల‌బ్ధి పొంద‌లేక‌పోతున్నార‌ని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Mar 26, 2026, 11.46 am IST

Harish Rao | ప్ర‌జాపాల‌న‌లో ఆరోగ్య‌శ్రీ ల‌బ్ధిదారులు 496 మందే : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : ఈ రెండున్న‌రేండ్ల ప్ర‌జాపాల‌న‌లో ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం కింద 496 మందే ల‌బ్ధి పొందిన‌ట్లు బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు తెలిపారు. ఈ ప‌థ‌కం కింద రూ. 5 ల‌క్ష‌ల నుంచి రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కు పెంచినా కూడా ఎందుకు ఎక్కువ మంది ల‌బ్ధి పొంద‌లేక‌పోతున్నార‌ని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఆరోగ్య శ్రీపై హ‌రీశ్‌రావు మాట్లాడారు.

ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని వైఎస్సార్ ప్రారంభించారు. మా ప్ర‌భుత్వంలో కూడా రూ. 2 ల‌క్ష‌ల నుంచి రూ. 5 ల‌క్ష‌ల‌కు పెంచి కొన‌సాగించాం. బీఆర్ఎస్ హ‌యాంలో రూ. 8 వేల కోట్లు ఖ‌ర్చు పెట్టి 18 ల‌క్ష‌ల మందికి ఈ ప‌థ‌కం కింద సేవ‌లందించాం. కాంగ్రెస్ ప్ర‌భుత్వం రూ. 5 ల‌క్ష‌ల‌ నుంచి రూ. 10 ల‌క్ష‌ల‌కు పెంచుతామ‌ని చెప్పారు. మంత్రి స‌మాధానం ద్వారా స్ప‌ష్టంగా అర్థ‌మైంది ఏంటంటే.. రూ. 5 ల‌క్షల‌ నుంచి రూ. 10 ల‌క్ష‌ల‌కు పెంచ‌డం వ‌ల్ల కేవ‌లం 496 మంది మాత్ర‌మే ల‌బ్ధి పొందారు.. ఈ రెండున్న‌రేండ్ల‌లో అని హ‌రీశ్‌రావు తెలిపారు.

కార్పొరేట్ ఆస్ప‌త్రుల్లో మేజ‌ర్ స‌ర్జ‌రీల‌కు ఆరోగ్య శ్రీ కింద ట్రీట్మెంట్ చేయ‌డం లేదు. ప్ర‌జ‌లు ఎందుకు అవ‌కాశం పొంద‌లేక‌పోతున్నారో రివ్యూ చేయండి. మా హ‌యాంలో రూ. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు లిమిట్ ఉన్న‌ప్ప‌టికీ 607 మందికి రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కు ల‌బ్ధి చేకూర్చామ‌ని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

గ్రీన్ చానెల్‌లో ఆరోగ్య శ్రీకి నిధులు విడుద‌ల చేస్తున్నామ‌ని సీఎం, మంత్రులు చెప్పారు. 2023-24లో రూ. 1067 కోట్లు ఖ‌ర్చు పెడితే, 2024-25లో 971 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు పెట్టారు. రూ. 5 ల‌క్ష‌ల నుంచి రూ. 10 ల‌క్ష‌ల‌కు పెరిగిన‌ప్పుడు రోగులు పెర‌గాలి.. ఖ‌ర్చు జ‌ర‌గాలి. కానీ బ‌డ్జెట్ కేటాయింపులు జ‌ర‌గ‌డం లేదు. బిల్లులు ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల యాజ‌మాన్యాలు నోటీసులు ఇచ్చారు. మీరు రివ్యూలు పెట్టిన కూడా డ‌బ్బులు విడుద‌ల కాలేదు. ఆస్ప‌త్రులు మూత‌ప‌డే అవ‌కాశం ఉంది. పెండింగ్ బిల్లులు ఎంత ఉన్నాయి. ఎప్ప‌టిలోగా చెల్లిస్తారో చెప్పాలి. బిల్లులు చెల్లిస్తే పేద‌ల‌కు మేలు జ‌రిగే అవ‌కాశం ఉంది. గ్రీన్ చానెల్‌లో పెట్టి ఆరోగ్య‌శ్రీ బిల్లులు ఎప్ప‌టిక‌ప్పుడు చెల్లించాల‌ని కోరుతున్నాం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement