Melodi | ఇటలీలో ప్రధాని మోదీ.. మరోసారి ట్రెండింగ్లో “మెలోడీ” మూమెంట్
Melodi | ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇటలీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని జార్జియా మెలోని కలిశారు. ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇరువురు నేతలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఎక్స్లో "మెలోడీ" మూమెంట్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
Melodi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni) మధ్య స్నేహబంధం మరోసారి నెటిజన్లను ఆకర్షిస్తోంది. ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఇటలీ (Italy) చేరుకున్న విషయం తెలిసిందే. రోమ్ (Rome)లో ల్యాండ్ అయిన మోదీకి ఆ దేశ ప్రధాని మెలోనీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి డిన్నర్ చేశారు. అనంతరం రోమ్లోని చారిత్రక ప్రదేశమైన కొలోసియమ్ (Colosseum)ను సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. వివిధ అంశాలపై ఇరువురు అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపారు. భారత్-ఇటలీ మధ్య స్నేహ బంధాలను మరింత పెంపొందించే దిశగా నేడు చర్చలు జరపనున్నట్లు పేర్కొన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi meets Prime Minister of Italy, Giorgia Meloni in Rome, Italy.
(Source: ANI/DD News) pic.twitter.com/ZbtaPgYNaK
— ANI (@ANI) May 20, 2026
అంతకుముందు తన మిత్రుడు ప్రధాని మోదీతో దిగిన సెల్ఫీ ఫొటోను ఇటలీ ప్రధాని ఎక్స్ వేదికగా షేర్ చేశారు. "వెల్ కమ్ టు రోమ్.. మై ఫ్రెండ్" అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టుకు ఇటలీ, భారత్ జాతీయ జెండాలను ఎమోజీలుగా జత చేశారు. ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మెలోనీ షేర్ చేసిన సెల్ఫీ ఫొటోకి ఏకంగా 10 లక్షల కంటే ఎక్కువ వ్యూస్లు, దాదాపు 60 వేల లైక్లు వచ్చాయి. వీరి మధ్య స్నేహాన్ని అభినందిస్తూ దాదాపు రెండు వేల మంది కామెంట్లు చేశారు.
Welcome to Rome, my friend! 🇮🇹🇮🇳 pic.twitter.com/mUjFL4HIqY
— Giorgia Meloni (@GiorgiaMeloni) May 19, 2026
ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు "మెలోడీ" (Melodi) హ్యాష్ట్యాగ్తో నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. కాగా, ఇప్పటికే పలుసార్లు వీరిద్దరి ఫొటోలూ వైరల్ అయిన విషయం తెలిసిందే. దుబాయ్లో కాప్28 సదస్సు జరిగిన సమయంలో కూడా వీరి సెల్ఫీ ఫోటో వైరల్ అయ్యింది. గతంలో ఇటలీలో జరిగిన జీ7 సదస్సు సమయంలోనూ వీరి ఫొటో నెటిజన్లు ఆకర్షించింది. ఇప్పుడు మరోసారి "మెలోడీ" మూమెంట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ హ్యాష్ట్యాగ్ ఎక్స్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
Upon landing in Rome, had the opportunity to meet Prime Minister Meloni over dinner followed by a visit to the iconic Colosseum. We exchanged perspectives on a wide range of subjects. Looking forward to our talks today, where we will continue the conversation on how to boost the… pic.twitter.com/df0bDYKCdU
— Narendra Modi (@narendramodi) May 20, 2026
Also Read..
NALCO | ఐటీఐ, డిప్లొమా అర్హతతో నాల్కోలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనం.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
నేను క్షేమంగానే ఉన్నా.. హాస్పిటల్లో చేరాడన్న వార్తలపై అమితాబ్ క్లారిటీ
సంబంధిత వార్తలు

Cabinet Decisions | రూ. 9,450 కోట్ల భారీ రైల్వే విస్తరణ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం.. ఏపీకి దక్కిన ప్రాధాన్యం
ఆగస్టు 19, 2026

Telangana BJP | బండి అవుట్.. ఈటల, అరుణ ఇన్
ఆగస్టు 18, 2026

Rahul Gandhi | తప్పులు ఎన్టీఏ చేస్తే.. శిక్ష మాత్రం విద్యార్థులు అనుభవిస్తున్నారు.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్
ఆగస్టు 17, 2026
తాజావార్తలు
- ●Google AI | విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఏడాదిపాటు జెమిని ఏఐ ప్లాన్ ఫ్రీ..
- ●Sushmita Konidela | ప్రకాష్రాజ్తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- ●Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్మనీ.. ఇన్ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
- ●Meta | మెటా పాలసీలపై ఓవర్సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..
- ●BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్
- ●Talasani Srinivas Yadav | ముఖ్యమంత్రి నోటి దురద తగ్గించుకో : మాజీమంత్రి తలసాని

Google AI | విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఏడాదిపాటు జెమిని ఏఐ ప్లాన్ ఫ్రీ..

Sushmita Konidela | ప్రకాష్రాజ్తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్మనీ.. ఇన్ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్

Meta | మెటా పాలసీలపై ఓవర్సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..



