PM Modi | దేశవ్యాప్తంగా భానుడి భగభగలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు
PM Modi | దేశవ్యాప్తంగా (across India) ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కీలక విజ్ఞప్తి చేశారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్న వేళ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
PM Modi | దేశవ్యాప్తంగా (across India) ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి (rising temperatures). దీంతో తీవ్రమైన వడగాల్పులకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కీలక విజ్ఞప్తి చేశారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్న వేళ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, వడదెబ్బ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మేరకు ప్రధాని ఎక్స్ వేదికగా కీలక పోస్టు పెట్టారు. “దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఎండ తీవ్రత మనందరిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోండి. వీలైనంత వరకూ ఇంటిపట్టునే ఉండండి. ఒకవేళ ఇంటి నుంచి బయటకు వెళ్తే.. వెంటే నీటిని కూడా తీసుకెళ్లండి. ఆ సమయంలో దాహంతో ఉన్న వారికి ఓ గ్లాసు నీరు ఇచ్చి సాయం చేయండి” అని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు.
తీవ్రమైన వేసవి కాలంలో పిల్లలు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రధాని సూచించారు. కళ్లు తిరగడం, వికారం, తీవ్రమైన అలసట వంటి వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఇతరుల్లో కూడా ఈ లక్షణాలు కనిపిస్తే వారికి సాయం చేయాలని పిలుపునిచ్చారు. వారిని చల్లగా, నీడ ఉన్న ప్రదేశానికి తరలించాలన్నారు. వారికి నీరు, ఓఆర్ఎస్ వంటివి అందించాలని సూచించారు. ఆపదలో ఉన్న వారికి సాయం అందించాలని ప్రధాని పిలుపునిచ్చారు. అలాగే మూగజీవాల పట్ల కూడా జాగ్రత్తలు వహించాలన్నారు. జంతువులు, పక్షుల పట్ల శ్రద్ధ వహించాలన్నారు. ఇళ్లు, బాల్కనీలు, టెర్రస్లు, దుకాణాలు, కార్యాలయాల బయట పక్షులు, జంతువుల కోసం నీటిని ఉంచాలని కోరారు.
Also Read..
ఈసీ చేపడుతున్న SIR చట్టబద్ధమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
తీవ్ర పరిణామాలు తప్పవు.. ఐరాస వేదికగా పాక్ ఉగ్రవాద చర్యలను ఎండగట్టిన భారత్
ఇది పర్యావరణ పరిరక్షణలో ఒక గొప్ప ముందడుగు: మంత్రి పొన్నం ప్రభాకర్
సంబంధిత వార్తలు

Mekedatu Dam Issue | కావేరీ జలాలపై మళ్లీ రగడ.. మేకెదాటు డ్యామ్ను అడ్డుకోవాలని ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
మే 26, 2026

Srilanka Free Visa For Indians | శ్రీలంక టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. నేటి నుంచే ‘ఫ్రీ వీసా’ ఎంట్రీ షురూ!
మే 25, 2026

Nirmala Sitharaman | దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం తగదు : నిర్మలమ్మ
మే 25, 2026
తాజావార్తలు
- ●Rs 1,000 crore cocaine seized | కచ్ తీరంలో రూ.1000 కోట్ల డ్రగ్స్ పట్టివేత
- ●Samsung | ఏఐ బూమ్తో శాంసంగ్ చిప్ డివిజన్ ఉద్యోగులకు జాక్పాట్.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల మేర బోనస్..
- ●Balka Suman | బీఆర్ఎస్ నేత బాల్క సుమన్పై కేసు నమోదు
- ●POCSO Case | పోక్సో కేసు.. నిందితుడికి 20 ఏండ్ల కఠిన జైలు శిక్ష
- ●Central Railway Stations | ప్రయాణికులకు అలర్ట్.. పెరగనున్న ఇడ్లీ, దోశ, సమోస, వడ పావ్ ధరలు
- ●Balka Suman | నాపై మళ్లీ కేసు పెట్టి జైలుకు పంపుతారేమో : బాల్క సుమన్

Rs 1,000 crore cocaine seized | కచ్ తీరంలో రూ.1000 కోట్ల డ్రగ్స్ పట్టివేత

Samsung | ఏఐ బూమ్తో శాంసంగ్ చిప్ డివిజన్ ఉద్యోగులకు జాక్పాట్.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల మేర బోనస్..

Balka Suman | బీఆర్ఎస్ నేత బాల్క సుమన్పై కేసు నమోదు

POCSO Case | పోక్సో కేసు.. నిందితుడికి 20 ఏండ్ల కఠిన జైలు శిక్ష



