త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

POCSO Case | పోక్సో కేసు.. నిందితుడికి 20 ఏండ్ల క‌ఠిన జైలు శిక్ష‌

POCSO Case | పోక్సో కేసులో ఓ నిందితుడికి 20 ఏళ్ల క‌ఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10 వేల జ‌రిమానా విధిస్తూ నాంప‌ల్లి కోర్టు బుధ‌వారం తీర్పు ఇచ్చింది.

S

Hyderabad | Published On May 27, 2026, 1.32 pm IST

POCSO Case | పోక్సో కేసు.. నిందితుడికి 20 ఏండ్ల క‌ఠిన జైలు శిక్ష‌
Advertisement

POCSO Case | త్రినేత్ర‌.న్యూస్ : పోక్సో కేసులో ఓ నిందితుడికి 20 ఏళ్ల క‌ఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10 వేల జ‌రిమానా విధిస్తూ నాంప‌ల్లి కోర్టు బుధ‌వారం తీర్పు ఇచ్చింది. అంబ‌ర్‌పేట పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని వ‌డ్లూరి ప‌వ‌న్‌(22) స్థానికంగా నివాసం ఉంటున్న 15 ఏళ్ల బాలిక‌తో ప‌రిచయం ఏర్ప‌రుచుకున్నాడ‌రు. వీరిద్ద‌రూ త‌రుచుగా ఫోన్‌లో మాట్లాడుకునేవారు. అయితే బాలిక‌ను ఆమె త‌ల్లిదండ్రులు నిల‌దీశారు. ఈ క్ర‌మంలో 2022 జులై 16న మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల స‌మ‌యంలో బాలిక ఇంట్లో ఎవ‌రికీ చెప్ప‌కుండా.. బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి, త‌న ఇంటికి తీసుకెళ్లి లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు.

దీంతో తీవ్ర ఆందోళ‌న‌కు గురైన బాలిక జ‌రిగిన విష‌యాన్ని త‌న త‌ల్లికి చెప్పింది. ఆ మ‌రుస‌టి రోజే బాధితురాలి త‌ల్లి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాధితురాలి వాంగ్మూలం న‌మోదు చేసుకుని భ‌రోసా సెంట‌ర్‌కు త‌ర‌లించారు.

మొత్తానికి ఈ కేసులో నేరారోప‌ణ‌లు రుజువు కావ‌డంతో నిందితుడు ప‌వ‌న్‌కు నాంప‌ల్లి కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష‌, రూ. 10 వేల జ‌రిమానా విధించింది. కోర్టు తీర్పుపై బాధితురాలి కుటుంబ స‌భ్యులు సంతోషం వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement