త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | ఇది పర్యావరణ పరిరక్షణలో ఒక గొప్ప ముందడుగు: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

Ponnam Prabhakar | ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) అన్నారు. ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నప్పటికీ, తెలంగాణ‌లో 2019 నుంచే వీటిని ప్రవేశపెట్టార‌ని చెప్పారు.

G

Telangana | Published On May 27, 2026, 12.49 pm IST

Ponnam Prabhakar | ఇది పర్యావరణ పరిరక్షణలో ఒక గొప్ప ముందడుగు: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్‌: ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) అన్నారు. ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నప్పటికీ, తెలంగాణ‌లో 2019 నుంచే వీటిని ప్రవేశపెట్టార‌ని చెప్పారు. అది కూడా జీసీసీ (GCC) విధానంలోనే అని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 960 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెట్టామ‌న్నారు. అదేవిధంగా ఇంటర్‌సిటీ కనెక్షన్ల కోసం మరో 500 ఎలక్ట్రిక్ బస్సులను కూడా మంజూరు చేశామ‌ని తెలిపారు. కూక‌ట్‌ప‌ల్లి డిపోలో కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో క‌లిసి మంత్రి ప్రారంభించారు. అనంత‌రం మాట్లాడుతూ.. త్వరలో వచ్చే మరో 200 ఎలక్ట్రిక్ బస్సులను పీఎంఈ డ్రైవ్ పథకం ద్వారా అందుబాటులోకి తీసుకువ‌స్తున్నామ‌న్నారు.

డీజిల్ బ‌స్సుల‌కు ఎల‌క్ట్రిక్ ఇంజిన్‌..

దీంతో పాటు రిట్రోఫిట్‌మెంట్ విధానంలో ప్రస్తుతం ఉన్న 20 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ ఇంజిన్‌లతో మార్చ‌డం చేయడం ద్వారా ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని ఇంకా విస్తరించే ప్రయత్నం జరుగుతున్న‌ద‌ని వెల్ల‌డించారు. మరో 250 బస్సులను కూడా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రక్రియ కొనసాగుతున్న‌ద‌ని చెప్పారు. ఆ త‌ర్వాత‌ మరిన్ని డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్పిడి చేసే అవకాశం ఉంన్నారు. దీంతో ఆర్టీసీ కార్మికులకు, సిబ్బందికి కూడా మంచి వాతావరణం లభిస్తుందని తెలిపారు. ముఖ్యంగా డీజిల్ బస్సుల వల్ల వచ్చే పొగ, కాలుష్యం తగ్గిపోవడంతో వారికి ఆరోగ్యకరమైన పని వాతావరణం ఏర్పడుతుందన్నారు.

సౌకర్యవంతమైన, మృదువైన ప్రయాణం

ప్రయాణికులకు కూడా చాలా సౌకర్యవంతమైన, మృదువైన ప్రయాణ అనుభవం లభిస్తుంద‌ని చెప్పారు. మనం సుమారు 3000 బస్సులను పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చగలిగితే, ప్రతిరోజూ దాదాపు 600 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించగలమన్నారు. ఇది పర్యావరణ పరిరక్షణలో ఒక గొప్ప ముందడుగు అవుతుంది. త్వరలో జేటీఎంలను కూడా ప్రవేశపెట్టే ఆలోచన ఉందని తెలిపారు.

Advertisement
Advertisement