త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kiren Rijiju | యువ‌త‌కు సంబంధించిన అంశం.. రాజ‌కీయం చేయొద్దు : కిర‌ణ్ రిజుజు

Kiren Rijiju | నీట్ పేప‌ర్ లీకేజీ అంశంపై (NEET paper leak issue) చ‌ర్చ‌కు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు (Kiren Rijiju) పున‌రుద్ఘాటించారు.

D

National | Published On Jul 23, 2026, 1.14 pm IST

Kiren Rijiju | యువ‌త‌కు సంబంధించిన అంశం.. రాజ‌కీయం చేయొద్దు : కిర‌ణ్ రిజుజు
Advertisement

Kiren Rijiju | నీట్ పేప‌ర్ లీకేజీ అంశంపై (NEET paper leak issue) చ‌ర్చ‌కు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు (Kiren Rijiju) పున‌రుద్ఘాటించారు. ఎలాంటి ముంద‌స్తు ష‌ర‌తులు లేకుండా ఈ చ‌ర్చ‌లో పాల్గొనాల‌ని ప్ర‌తిప‌క్షాల‌ను కోరారు. విద్యార్థుల‌కు సంబంధించిన ఈ అంశంపై రాజ‌కీయాలు చేయొద్ద‌ని వ్యాఖ్యానించారు.

ఇవాళ ఉద‌యం రాజ్య‌స‌భ‌లో (Rajya Sabha) కిరణ్ రిజుజు మాట్లాడారు. నీట్ అంశంపై త‌క్ష‌ణ‌మే చ‌ర్చ‌ను ప్రారంభించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. చ‌ర్చ‌కు ముందు ష‌ర‌తులు ఎందుకు పెడుతున్నారంటూ విప‌క్ష పార్టీల‌ను ప్ర‌శ్నించారు. "నీట్ అంశంపై చర్చ జరగాలని అందరూ డిమాండ్ చేశారు. ఈ చర్చకు ఎలాంటి షరతు ఉండకూడదు. ఒకవేళ షరతులు ఉంటే.. దీనిపై చ‌ర్చ చేప‌ట్ట‌డం మీకు ఇష్టంలేద‌ని అర్థం. ఇది చాలా సున్నిత‌మైన అంశం. విద్యార్థుల భ‌విష్య‌త్తుకు సంబంధించిన‌ది. కాబ‌ట్టి ఈ విష‌యంలో రాజ‌కీయాలు చేయ‌కూడ‌దు. అంతా క‌లిసి ఈ అంశంపై ఈరోజే చ‌ర్చించుకుందాం. ఈ చ‌ర్చ‌లో ఎలాంటి ష‌ర‌తులూ లేకుండా అంద‌రూ పాల్గొనాలి" అని కిర‌ణ్ రిజుజు పేర్కొన్నారు. యువత భవిష్యత్తు విషయంలో రాజీపడేది లేదని ప్రధాని స్పష్టంగా చెప్పారని ఈ సంద‌ర్భంగా కిర‌ణ్ రిజుజు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోందని వ్యాఖ్యానించారు. అయితే, విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేస్తేనే చ‌ర్చ‌కు వ‌స్తామంటూ కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే తెగేసి చెప్పారు.

Also Read..

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో అధికార‌, విప‌క్ష ఎంపీల ఆందోళ‌న‌.. పోటాపోటీ నినాదాలు

మెట్రో స్టేష‌న్లు క్లోజ్‌.. లంచ్ టైమ్‌కి స‌మ‌స్య క్లియ‌ర్ కాక‌పోతే జోక్యం చేసుకుంటాన‌న్న సీజేఐ

పోలీసుల‌పై రాళ్లు విసురుతున్న‌ది బీజేపీ గూండాలే.. అభిజీత్ దిప్కే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Advertisement
Advertisement