NEET Exam | వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో నీట్ పరీక్ష.. ప్రకటించిన కేంద్ర మంత్రి
NEET Exam | వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను (NEET Exam) పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ (Dharmendra Pradhan) శుక్రవారం ప్రకటించారు. అదేవిధంగా పరీక్షల్లో అవకతవకల పట్ల ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.
NEET Exam | నీట్ యూజీ పేపర్ లీక్ ఆరోపణల (NEET Paper Leak) నేపథ్యంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను (NEET Exam) పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ (Dharmendra Pradhan) శుక్రవారం ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.
ఈనెల 3న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకైనట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇవాళ కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు అధికారులు ధృవీకరించడంతోనే ఆ పరీక్షను రద్దు చేసినట్లు తెలిపారు. రీఎగ్జామినేషన్ జూన్ 21న నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులను జూన్ 14 నాటికి జారీ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. "నీట్ యూజీ 2026 పరీక్ష మే3న జరిగింది. అయితే మే 7న గెస్ పేపర్ గురించి ఆందోళనలను వ్యక్తమయ్యాయి. కొన్ని రోజుల్లోనే పేపర్ లీకైనట్లు అధికారులు ధృవీకరించారు. పేపర్ లీకైనట్లు మాకు ఖచ్చితమైన సమాచారం అందిన వెంటనే.. విచారణకు ఆదేశాలు జారీచేశాం. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ పరీక్షను రద్దు చేశాం. పేపర్ ఎలా లీకైంది.. ఎవరు లీక్ చేశారన్న దానిపై విచారణ జరుగుతోంది. ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈసారి ఎలాంటి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూసుకుంటాం" అని ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు.
వ్యవస్థను పటిష్టం చేయాలి..
అదేవిధంగా పరీక్షల్లో అవకతవకల పట్ల ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. పరీక్షా విధానాన్ని దెబ్బతీయాలని చూసే ఎవరైనా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎలాంటి తప్పలూ జరగకుండా పరీక్షలు నిర్వహించేందుకు వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఇక నీట్ రీటెస్ట్ కోసం విద్యార్థులు నచ్చిన నగరాన్ని ఎంచుకోవచ్చని మంత్రి తెలిపారు. ఇందుకోసం వారం రోజులు గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను అమలు చేసినప్పటికీ, పరీక్షా నిర్వహణ క్రమంలో లోపం జరిగిందని ఆయన అంగీకరించారు. వ్యవస్థను పటిష్టం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Also Read..
జూన్ 21న నీట్ యూజీ రీఎగ్జామ్.. ప్రకటించిన ఎన్టీఏ
ఎన్నికలు ముగిశాయి.. మోదీ వసూళ్లు మొదలయ్యాయి.. ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ విమర్శలు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

NEET UG | అన్నీ సేమ్.. గెస్ పేపర్లో అడిగిన కెమిస్ట్రీ ప్రశ్నలే నీట్ యూజీలో కూడా!
మే 20, 2026

NEET | నీట్పై ధర్మేంద్ర ప్రదాన్ ఉన్నత స్థాయి సమీక్ష
మే 19, 2026

NEET Paper Leak | నీట్ పేపర్ లీక్లో మరో అరెస్ట్.. ఎగ్జామ్కు 10 రోజుల ముందే కోచింగ్ సెంటర్ డైరెక్టర్కు చేరిన ప్రశ్నపత్రం
మే 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



