త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Petrol Diesel Prices | ఈ రాష్ట్రంలో దేశంలోనే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఎక్కువ‌..

Petrol Diesel Prices | దేశంలో దాదాపు నాలుగేండ్ల త‌ర్వాత పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు (Petrol Diesel Prices) పెరిగాయి. ప్ర‌ధాని పొదుపు మంత్రం, చ‌మురు వినియోగాన్ని త‌గ్గించాల‌న్న ప్ర‌క‌ట‌న త‌ర్వాత పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను దేశీయ చ‌మురు కంపెనీలు పెంచాయి.

G

National | Published On May 15, 2026, 11.26 am IST

Petrol Diesel Prices | ఈ రాష్ట్రంలో దేశంలోనే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఎక్కువ‌..
Advertisement

Petrol Diesel Prices | త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలో దాదాపు నాలుగేండ్ల త‌ర్వాత పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు (Petrol Diesel Prices) పెరిగాయి. ప్ర‌ధాని పొదుపు మంత్రం, చ‌మురు వినియోగాన్ని త‌గ్గించాల‌న్న ప్ర‌క‌ట‌న త‌ర్వాత పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను దేశీయ చ‌మురు కంపెనీలు పెంచాయి. దేశ‌వ్యాప్తంగా ప్ర‌తి లీట‌ర్‌పై స‌గ‌టున రూ.3 వ‌డ్డించాయి. దీంతో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.110 దాటింది. డిజిల్ కూడా రూ.100కి చేరువైంది. ఇక తాజా పెంపుతో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) అగ్ర‌స్థానంలో నిలిచింది.

ఉమ్మ‌డి రాష్ట్రం ఉన్న‌ప్ప‌టి నుంచే..

ఉమ్మ‌డి రాష్ట్రం ఉన్న‌ప్ప‌టి నుంచే ఏపీలో చ‌మురులు దేశంలోనే అత్య‌ధికంగా ఉంటున్నాయి. అదే ప‌రంప‌ర‌ను ఇప్ప‌టికీ ఆ రాష్ట్రం కొన‌సాగిస్తున్న‌ది. ప‌ల్నాడులో అత్య‌ధికంగా రూ.113.62గా ఉన్న‌ది. అతిత‌క్కువ‌గా అన‌కాప‌ల్లిలో రూ.111.63గా ఉన్న‌ది. ఇక‌ విజ‌య‌వాడ‌లో రూ.113.03, అన్న‌మ‌య్య, చిత్తూరు, కాకినాడ‌, కృష్ణ‌, నెల్లూర్‌, పార్వ‌తీపురం మ‌న్యం, వెస్ట్ గోదావ‌రిలో లీట‌రు పెట్రోల్ ధ‌ర‌ రూ.113 పైనే ఉన్న‌ది.

రూ.100 దాటిన డీజిల్‌..

ఇక డీజిల్ ధ‌ర ఏపీలో రూ.100.71 ఉండ‌గా, అత్య‌ధికంగా ప‌ల్నాడులో రూ.101.24గా ఉంది. ఆ త‌ర్వాత నెల్లూరులో రూ.101.11గా ఉంది. అతి త‌క్కువ‌గా అన‌కాప‌ల్లిలో రూ.99.36 గాఉంది. విశాఖ (రూ.99.47), ప్ర‌కాశం (రూ.99.66), కోన‌సీమ (రూ.99.95), క‌డ‌ప (రూ.99.87), అనంత‌పూర్ (రూ.99.78) లో మాత్ర‌మే రూ.100 లోపు ఉన్న‌ది. మిగిలిన అన్ని ప‌ట్ట‌ణాల్లో రూ.100 పైగా ఉంది. కేంద్రంలోని ఎన్డీయే కూట‌మిలో ఉన్న టీడీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్ప‌టికీ పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఉపశమనం కల్పించకపోవడంపై ఏపీ ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

యుద్ధం ప్ర‌భావం..

కాగా, దేశంలో నాలుగేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరగియి. ర‌ష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్ర‌భావం ఉన్న‌ప్ప‌టికీ 2022 ఏప్రిల్ నుంచి ధ‌ర‌లు మార‌లేదు. 2024 మార్చిలో లోక్‌సభ ఎన్నికలకు ముందు లీటరుకు రూ.2 చొప్పున తగ్గించాయి. అయితే ఇరాన్, అమెరికా యుద్ధం నేప‌థ్యంలో గ్యాస్ ధ‌ర‌లు పెంచిన ప్ర‌భుత్వం.. తాజాగా పెట్రోల్‌, డీజిల్‌పై కూడా వ‌డ్డించింది.

దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రో, డీజిల్ ధ‌ర‌లు ఇలా..

  • ఢిల్లీ- పెట్రోల్ రూ.97.77, డీజిల్ రూ.90.67
  • ముంబై- పెట్రోల్‌ రూ.106.54, డీజిల్‌ రూ.93.03
  • హైదరాబాద్‌- పెట్రోల్‌ రూ.110.50, డీజిల్‌ రూ.98.70
  • కోల్‌కతా- పెట్రోల్‌ రూ.108.45, డీజిల్‌ రూ.95.02
  • చెన్నై- పెట్రోల్‌ రూ.103.80, డీజిల్ రూ.95.39
  • బెంగళూరు- పెట్రోల్‌ రూ.105.96, డీజిల్‌ రూ.93.99
  • పాట్నా- పెట్రోల్‌ రూ.108.54, డీజిల్‌ రూ.94.78
  • జైపూర్‌- పెట్రోల్‌ రూ.108.03, డీజిల్‌ రూ.93.49
  • తిరువనంతపురం- పెట్రోల్‌ రూ.110.38, డీజిల్‌ రూ.99.26
  • చండీగఢ్‌- పెట్రోల్‌ రూ.97.30, డీజిల్‌ రూ.85.45
Advertisement
Advertisement