త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manipur | మణిపూర్‌లో మళ్లీ హింస.. 20కి పైగా ఇళ్లకు నిప్పు

Manipur | ఈశాన్య రాష్ట్రం మ‌ణిపూర్‌లో (Manipur) మ‌రోసారి హింస చెల‌రేగింది. కామ్‌జోంగ్ జిల్లాలో నాగా, కుకీ (Naga, Kuki) సామాజిక వర్గాల మధ్య సాయుధ ఘర్షణలు చోటుచేసుకున్నాయి (Manipur violence). ఇరు వ‌ర్గాలు మూడు గ్రామాల్లోని 20కిపైగా ఇళ్ల‌కు నిప్పు పెట్టారు.

D

National | Published On Jul 2, 2026, 2.33 pm IST

Manipur | మణిపూర్‌లో మళ్లీ హింస.. 20కి పైగా ఇళ్లకు నిప్పు
Advertisement

Manipur | ఈశాన్య రాష్ట్రం మ‌ణిపూర్‌లో (Manipur) మ‌రోసారి హింస చెల‌రేగింది. కామ్‌జోంగ్ జిల్లాలో నాగా, కుకీ (Naga, Kuki) సామాజిక వర్గాల మధ్య సాయుధ ఘర్షణలు చోటుచేసుకున్నాయి (Manipur violence). ఈ ఘ‌ర్ష‌ణ‌లు తీవ్ర‌రూపం దాల్చ‌డంతో ఇరు వ‌ర్గాలు మూడు గ్రామాల్లోని 20కిపైగా ఇళ్ల‌కు నిప్పు పెట్టారు. భార‌త్‌-మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దు సమీపంలోని కుకీల గ్రామ‌మైన ఫైమోల్‌ను దుండ‌గులు త‌గ‌ల‌బెట్టారు. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం 15 ఇళ్లు కాలి బూడిద‌య్యాయి.

మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల ప్రాంతంలో ఈ ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్నాయి. కుకీ గ్రామం నుంచి వచ్చిన సాయుధులు సమీపంలోని నాగా గ్రామంపై దాడిచేసి 10 ఇళ్లను తగలబెట్టడంతో ఈ హింస ప్రారంభమైన‌ట్లు అధికారులు తెలిపారు. ప్ర‌స్తుతం నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా గ్రామ‌స్థులు ఇప్ప‌టికే ఇళ్ల‌ను ఖాళీ చేసి 11 అస్సాం రైఫిల్స్ క్యాంప్ ఉన్న ఐషి గ్రామంలో తాత్కాలిక ఆశ్ర‌యం పొందుతున్నారు. తాజా ఘ‌ర్ష‌ణ‌ల‌తో భ‌ద్ర‌తా దళాలు రంగంలోకి దిగాయి. ప్ర‌స్తుతం అక్క‌డ ప‌రిస్థితి అదుపులోనే ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.

Also Read..

మీరు మ‌గాళ్ల‌యితే చ‌ర్చ‌కు రండి

రాముడి పేరుతో బీజేపీ దోపిడీకి పాల్ప‌డింది : డీకే శివ‌కుమార్‌

డెల్ నుంచి కొత్త ఏలియన్‌వేర్ 15 ల్యాప్‌టాప్‌.. కంటెంట్ క్రియేట‌ర్లు, గేమర్లకు బెస్ట్ ఫీచ‌ర్లు..

Advertisement
Advertisement