Manipur Violence | మణిపూర్లో మళ్లీ హింస.. గ్రామంపై కాల్పులు, ఇళ్లకు నిప్పు.. ముగ్గురు మృతి
Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరోసారి హింస (Manipur Violence) చెలరేగింది. గ్రామంపై గుర్తుతెలియని సాయుధ దుండగులు శుక్రవారం తెల్లవారుజామున దాడికి పాల్పడ్డారు. పలువురిపై కాల్పులు జరిపి ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరోసారి హింస (Manipur Violence) చెలరేగింది. కాంగ్పోక్పి (Kangpokpi) జిల్లాలోని న్యూ కీథెల్మాన్బి (New Keithelmanbi) ప్రాంతం పరిధిలోని లోయిబోల్ (Loibol) గ్రామంపై గుర్తుతెలియని సాయుధ దుండగులు శుక్రవారం తెల్లవారుజామున దాడికి పాల్పడ్డారు. పలువురిపై కాల్పులు జరిపి ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
తెల్లవారుజామున 4:10 గంటల సమయంలో ఈ దాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆయుధాలతో వచ్చిన సాయుధ ముఠా గ్రామస్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పలు ఇళ్లకు నిప్పంటించారు. ఈ దాడితో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరణించిన ముగ్గురిని లెతోఖోంగం హావ్కిప్, తిన్మేరీ హావ్కిప్, జంగ్మిన్లాల్ హావ్కిప్గా గుర్తించారు. ఈ సంఘటనతో ఆ గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించింది. దాడికి దారితీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు, గ్రామంపై దాడి చేసిన సాయుధ మిలిటెంట్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దాడికి ఇప్పటి వరకూ ఏ సంస్థ బాధ్యత వహించలేదు.
Also Read..
టీవీకే బిగ్ ట్విస్ట్.. తిరుచ్చి ఈస్ట్ నుంచి రాఘవ లారెన్స్ పోటీ..?
సుఖోయ్ ఎస్యూ-57 తయారుచేద్దాం.. భారత్కు పుతిన్ కీలక ప్రతిపాదన
ధనుష్ సినిమాలో సాయి పల్లవి షాకింగ్ రోల్ - లేడీ సింగంగా నాచురల్ బ్యూటీ
సంబంధిత వార్తలు

PM Modi | మెలోనీకి ప్రత్యేక కానుకలు ఇచ్చిన ప్రధాని మోదీ.. అవేంటంటే..?
మే 21, 2026

Earthquake | ఈశాన్య రాష్ట్రాలను వణికించిన భూకంపం.. పరుగులు తీసిన జనం
ఏప్రిల్ 21, 2026

PM Modi | మోదీ గారూ మణిపూర్నూ విజిట్ చేయండి.. అస్సాం పర్యటన వేళ ప్రధానికి ఫ్లైట్ టికెట్ బుక్చేసిన కాంగ్రెస్
ఫిబ్రవరి 14, 2026
తాజావార్తలు
- ●KCR | కేసీఆర్కు ఊడిగం చేయడం ఆపండి.. పాలమూరు బీఆర్ఎస్ నేతలకు సీఎం రిక్వెస్ట్..!
- ●TATA EV | టాటా ఈవీలపై భారీ రాయితీలు.. రూ.3.35 లక్షల వరకు డిస్కౌంట్లు..
- ●CM Revanth Reddy | తిన్నది అరిగేదాక తిరిగండి.. బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ సెటైర్లు
- ●Delhi Hotel Fire | అగ్నిప్రమాదంలో 13 మంది విదేశీయులు మరణించారు : విదేశాంగ శాఖ
- ●Web Series | హీరోగా మారిన టాలీవుడ్ కమెడియన్ - వెరైటీ టైటిల్తో వెబ్సిరీస్
- ●CM Revanth Reddy | భూసేకరణ జరుగకుండా ప్రాజెక్టు పూర్తవుతుందని కేసీఆర్ ఎట్ల అనుకున్నరు? ప్రశ్నించిన సీఎం రేవంత్

KCR | కేసీఆర్కు ఊడిగం చేయడం ఆపండి.. పాలమూరు బీఆర్ఎస్ నేతలకు సీఎం రిక్వెస్ట్..!

TATA EV | టాటా ఈవీలపై భారీ రాయితీలు.. రూ.3.35 లక్షల వరకు డిస్కౌంట్లు..

CM Revanth Reddy | తిన్నది అరిగేదాక తిరిగండి.. బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ సెటైర్లు

Delhi Hotel Fire | అగ్నిప్రమాదంలో 13 మంది విదేశీయులు మరణించారు : విదేశాంగ శాఖ



