త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajya Sabha | బెంగాల్ రాజ్య‌స‌భ ఉప ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌

Rajya Sabha | బెంగాల్‌లో ముగ్గురు తృణ‌మూల్ (TMC) నేత‌ల రాజీనామాతో ఖాళీ ఏర్ప‌డిన మూడు రాజ్య‌స‌భ (Rajya Sabha) స్థానాల‌కు ఉప ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ఈసీ విడుద‌ల చేసింది. జులై 24న పోలింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఈసీ ప్ర‌క‌టించింది.

D

National | Published On Jul 6, 2026, 12.10 pm IST

Rajya Sabha | బెంగాల్ రాజ్య‌స‌భ ఉప ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌
Advertisement

Rajya Sabha | ప‌శ్చిమ బెంగాల్ (West Bengal)లోని మూడు రాజ్య‌స‌భ (Rajya Sabha) స్థానాల‌కు ఉప ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ఈసీ (Election Commission) సోమ‌వారం విడుద‌ల చేసింది. ఇందుకు సంబంధించిన జులై 7న నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్నారు. నామినేష‌న్ల దాఖ‌లుకు జులై 14 వ‌ర‌కూ గ‌డువు ఇచ్చారు. జులై 15న నామినేష‌న్ల ప‌రిశీల‌న‌, జులై 17 నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఉంటుంది.

జులై 24న పోలింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఈసీ ప్ర‌క‌టించింది. ఉద‌యం 9 గంట‌ల నుంచి 4 గంట‌ల వ‌ర‌కూ పోలింగ్ కొన‌సాగ‌నుంది. అనంత‌రం ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్లు ఈసీ వెల్ల‌డించింది. జులై 27లోపు ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగుస్తుంద‌ని ఈసీ త‌న నోటిఫికేష‌న్‌లో తెలిపింది. కాగా, తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్ సభ్యులు సుఖేందు శేఖర్ రాయ్, సుష్మితా దేవ్, ప్రకాష్ చిక్ బరాయిక్ తమ పదవీ కాలం ముగియక ముందే రాజీనామా చేయడంతో ఎన్నిక‌లు అనివార్య‌మ‌య్యాయి. ఇక ఈ ఎన్నికల ద్వారా నూతనంగా ఎంపికయ్యే ఎంపీలు 2029 ఆగస్టు నుంచి 2030 ఏప్రిల్ వరకు సభ్యులుగా కొనసాగుతారు.

Also Read..

ఒకే సినిమాకు ఆరుగురు డైరెక్ట‌ర్లు - మ‌మితా బైజు హీరోయిన్ - నిర్మాత‌గా కోలీవుడ్ స్టార్‌

మూడు రోజుల్లో 56 వేల మంది ద‌ర్శ‌నం.. 90% క‌రిగిపోయిన మంచు లింగం..!

ముంబైలో వ‌ర్ష బీభ‌త్సం.. విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు... ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వే మూసివేత‌.. రైలు స‌ర్వీసులు ర‌ద్దు

Advertisement
Advertisement