Ashok Gehlot | ఇందిర బతికుండి ఉంటే బీజేపీని ఎప్పుడో నిషేధించేవారు.. అశోక్ గహ్లోత్ వివాదాస్పద వ్యాఖ్యలు
Ashok Gehlot | రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ (Ashok Gehlot) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో అత్యంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయన్నారు.
Ashok Gehlot | రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ (Ashok Gehlot) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో అత్యంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. తన 50 ఏళ్ల ప్రజా జీవితంలో ఇంతటి ప్రమాదకర పరిస్థితులు ఎన్నడూ చూడలేదన్నారు. బీజేపీ అభివృద్ధిని పక్కనపెట్టి హిందుత్వ పేరుతోనే రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. నేడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) బతికుండి ఉంటే బీజేపీ లాంటి పార్టీని ఎప్పుడో నిషేధించేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జైపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలనలో దేశం అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందన్నారు. దేశ ప్రజలు ఇప్పటికైనా మేల్కొనకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వకపోవడాన్ని ఈ సందర్భంగా గహ్లోత్ ప్రస్తావించారు. కనీసం కొన్ని స్థానాలైనా కేటాయించి ఉండి ఉంటే దేశానికి వేరే సందేశం వెళ్లేదని అభిప్రాయపడ్డారు.
"దేశ ప్రజలకు చూపించడానికైనా కనీసం ఒక ఐదు సీట్లు అయినా ఇచ్చి ఉండాల్సింది. కానీ మాది కేవలం 'ప్యూర్ హిందుత్వ పార్టీ' అని ప్రొజెక్ట్ చేసుకోవడమే వారి ఉద్దేశం. కేవలం హిందుత్వ మద్దతుదారులను రెచ్చగొట్టి పాలించాలనే ఆలోచనలో వారు ఉన్నారు. ఇందిరా గాంధీ లాంటి మహోన్నత నాయకులు ఈరోజు బతికి ఉంటే.. బీజేపీ లాంటి పార్టీపై ఎప్పుడో నిషేధం విధించి ఉండేవారు" అని గహ్లోత్ విమర్శించారు. "హిందుత్వ ఎజెండాతోనే మీరు పార్టీని నడుపుతారా..? కేవలం హిందువుల పేరుతోనే రాజకీయం చేయాలనుకుంటున్నారా..?" అంటూ ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అశోక్ గహ్లోత్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్కు హిందువులు, హిందుత్వం అంటే ద్వేషమని ఆరోపించింది.
Also Read..
సమగ్ర భాగస్వామ్య స్థాయికి భారత్-స్లోవేకియా ద్వైపాక్షిక సంబంధాలు : ప్రధాని మోదీ
16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం.. బ్రిటన్ ప్రధాని కీలక ప్రకటన
బాల్య వివాహాలపై రాష్ట్రవ్యాప్త పోరు.. తరుణి సంస్థతో ప్రభుత్వం కీలక ఒప్పందం..
సంబంధిత వార్తలు

BRS | సరూర్నగర్లో సంగ్రామ సదస్సు.. బీఆర్ఎస్ నేతల గృహనిర్బంధం
జులై 18, 2026

Chanagani Dayakar | యువ సంగ్రామ సదస్సు కాదు.. నిరుద్యోగులకు బీఆర్ఎస్ చేసిన విద్రోహ సభ: చనగాని దయాకర్
జులై 17, 2026

KTR | కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ వైఫల్యాలను ప్రజలకు వివరిద్దాం.. విద్యార్థుల యువజన సభలో అన్నీ చెబుదాం
జులై 16, 2026
తాజావార్తలు
- ●Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
- ●Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
- ●TTA Convention USA | అమెరికాలో టీటీఏ మహాసభల సందడి: తెలంగాణ అధికారులకు షార్లెట్లో ఆత్మీయ స్వాగతం

Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!

Power Demand | ఎల్నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి



