త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి

Dasoju Sravan | రూ.30 వేల కోట్ల మెట్రో ఆస్తుల‌ను రూ.15 వేల కోట్ల‌కే ద‌క్కించుకున్నామ‌ని సీఎం రేవంత్‌రెడ్డి గొప్ప‌లు చెప్పుకొంటున్నార‌ని.. అలా చేయ‌డానికి ఆయ‌నేమైనా ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా అని ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ ఎద్దేవా చేశారు. మెట్రో ఆస్తులను తన బినామీలకు కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

S

Telangana | Published On Jun 15, 2026, 7.04 pm IST

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
Advertisement
  • మోదీ, అమిత్‌షాకు ఆయ‌న స‌రెండ‌ర్ అయ్యారు
  • రేవంత్‌కు చేత‌నైతే మోదీ ఇంటి ముందు ధ‌ర్నా చేయాలి
  • రూ.13 వేల కోట్ల మెట్రో అప్పును ప్రజలపై రుద్దుతున్నారు
  • కేసీఆర్‌, కేటీఆర్‌ను తిట్ట‌డ‌మే ఆయ‌న అజెండా
  • మీడియా స‌మావేశంలో సీఎం రేవంత్‌పై దాసోజు ఫైర్‌

Dasoju Sravan | త్రినేత్ర‌.న్యూస్‌: రూ.30 వేల కోట్ల మెట్రో ఆస్తుల‌ను రూ.15 వేల కోట్ల‌కే ద‌క్కించుకున్నామ‌ని సీఎం రేవంత్‌రెడ్డి గొప్ప‌లు చెప్పుకొంటున్నార‌ని.. అలా చేయ‌డానికి ఆయ‌నేమైనా ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా అని ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో సోమ‌వారం నిర్వ‌హించిన‌ ప్రెస్ మీట్‌లో ఆయ‌న మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్‌ను తిట్ట‌డ‌మే రేవంత్ అజెండా అని.. ఆయ‌నొక మూర్ఖుడు అని ఫైర‌య్యారు. కేసీఆర్ చారిత్రక కట్టడాలను కాపాడుతూనే మెట్రో ఫేజ్-1 ను పూర్తి చేశార‌ని గుర్తు చేశారు. మెట్రో ఆస్తులను తన బినామీలకు కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

అదొక కుంభ‌కోణం..

రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ. కేసీఆర్, కేటీఆర్‌ను తిట్టడమే ఆయ‌న అజెండా. క్యూర్, ప్యూర్, రేర్ పైన అవగాహన లేదు. దీనిపై చర్చకు సిద్ధంగా ఉన్నారా? 2009 నుంచి కాంగ్రెస్ అసమర్థత వల్లే మెట్రో రైల్ ఆలస్యం అయింది. మెట్రోను రేవంత్ రెడ్డి మట్టిలో కలిపారు. అన్ని ప్రభుత్వ వ్యవస్థల్లో దందాలు చేస్తున్నారు. మెట్రో రైల్ కొనుగోలు వ్యవహారం పెద్ద కుంభకోణం. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని దాసోజు డిమాండ్ చేశారు.

రూ.13 వేల కోట్ల మెట్రో అప్పును తెలంగాణ ప్రజలపై రుద్దుతున్నారు. మెట్రో రైల్ సి.ఎఫ్.ఓ ను బెదిరించిన చరిత్ర రేవంత్ రెడ్డిది. హైటెక్ సిటీ టు శంషాబాద్ మెట్రో రైల్‌ను ఎందుకు రద్దు చేశారు? పెట్టుబడిదారులు హైదరాబాద్ రావాలంటే భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి తనపై కమిషన్ వేసుకోవాలి. మెట్రో ఫేజ్-2ను కిషన్ రెడ్డి అడ్డుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? అని శ్ర‌వ‌ణ్ ప్ర‌శ్నించారు.

బీజేపీ సీఎంలు కూడా మోదీని అన్నిసార్లు క‌ల‌వ‌లే..

ఇప్పటికే 71 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. బీజేపీ సీఎంలు కలవనన్ని సార్లు రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీని కలిశారు. మోదీని ఎపుడైనా మెట్రోపై నిలదీశారా? 8 మంది కాంగ్రెస్ లోక్ సభ సభ్యులు, 4 రాజ్యసభ సభ్యులు ఏం చేస్తున్నారు? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ రాదు.. సొంత రాష్ట్ర కేంద్ర మంత్రితో ప్రాజెక్టు తీసుకురాలేని స్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే. మోదీ, అమిత్‌షాకు రేవంత్ సరెండర్ అయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్‌ను హిమంత బిశ్వ శర్మలా చూస్తుంది. రేవంత్‌కు చేతనైతే మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలి. కేసీఆర్ ఫొటో పెట్టుకుని రోజూ భజన చేయాలి. మోదీని ప్రసన్నం చేసుకుని ఓటుకు నోటు కేసులో తప్పించుకోవాలని సీఎం రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు అని ఎమ్మెల్సీ దాసోజు ఆరోపించారు.

Advertisement
Advertisement