త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Flight Hit By Turbulence | ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు.. 12 మందికి గాయాలు

Flight Hit By Turbulence | థాయ్‌లాండ్‌లోని పుకెట్ దీవుల నుంచి న్యూఢిల్లీకి వ‌స్తున్న ఎయిర్ ఇండియా విమానం (Air India Flight) భారీ కుదుపుల‌కు (Flight Hit By Turbulence) లోనైంది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు సిబ్బంది స‌హా మొత్తం 12 మంది గాయ‌ప‌డ్డారు (Passengers).

D

National | Published On Aug 4, 2026, 2.53 pm IST

Flight Hit By Turbulence | ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు.. 12 మందికి గాయాలు
Advertisement

Flight Hit By Turbulence | త్రినేత్ర‌.న్యూస్ : థాయ్‌లాండ్‌లోని పుకెట్ దీవుల నుంచి న్యూఢిల్లీకి వ‌స్తున్న ఎయిర్ ఇండియా విమానం (Air India Flight) భారీ కుదుపుల‌కు (Flight Hit By Turbulence) లోనైంది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు సిబ్బంది స‌హా మొత్తం 12 మంది గాయ‌ప‌డ్డారు (Passengers). విమానం కూడా కొంత‌మేర‌ దెబ్బ‌తిన్న‌ది. ఈ ఘ‌ట‌న‌ను ఎయిర్ ఇండియా సంస్థ కూడా ధృవీక‌రించింది.

అధికారులు తెలిపిన స‌మాచారం ప్ర‌కారం.. ఎయిర్ ఇండియాకు చెందిన AI379 విమానం ఇవాళ పుకెట్ నుంచి ఢిల్లీకి బ‌య‌ల్దేరింది. విమానం గాల్లో ఉండ‌గా అక‌స్మాత్తుగా భారీ కుదుపుల‌కు గురైంది. విమానం ఎత్తు ఒక్క‌సారిగా కింద‌కు ప‌డిపోయింది. ఆ స‌మ‌యంలో విమానంలో సుమారు 134 మంది ప్ర‌యాణికులు, సిబ్బంది ఉన్నారు. అయితే, విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సేఫ్‌గా ల్యాండ్ అయిన‌ట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్ర‌యాణికులు, సిబ్బంది సుర‌క్షితంగా ఉన్న‌ట్లు తెలిపింది. గాయ‌ప‌డిన సిబ్బంది, ప్ర‌యాణికుల‌ను ఎయిర్‌పోర్టులోని వైద్య కేంద్రంలో చికిత్స అందిస్తున్న‌ట్లు చెప్పింది. ప్ర‌యాణికులు, సిబ్బంది భ‌ద్ర‌తే త‌మ‌కు తొలి ప్రాధాన్య‌త అని ఎయిర్ ఇండియా త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Also Read..

రాజీనామా చేస్తే.. క్ష‌ణం ఆలోచించ‌కుండా ఆమోదిస్తా.. అస‌మ్మ‌తి ఎమ్మెల్యేల‌కు డీకే స్ట్రాంగ్ వార్నింగ్‌

30 సెక‌న్ల‌లో 34 క‌త్తిపోట్లు.. స్కూల్‌ టీచ‌ర్‌పై వ్య‌క్తి పైశాచిక దాడి

కాసుల వ‌ర్షం కురిపిస్తున్న పెన్నీ స్టాక్స్‌.. 6 నెల‌ల్లో 198 శాతం లాభాలు..

Advertisement

తాజావార్తలు

Advertisement