త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బ‌స్సులో చెల‌రేగిన మంట‌లు.. ప‌రుగులు తీసిన ప్ర‌యాణికులు

MGBS | ఎంజీబీఎస్‌లో మంగ‌ళ‌వారం ఉద‌యం అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ప్లాట్‌ఫామ్‌పై నిలిపి ఉంచిన సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సు ముందు భాగంలో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో అక్క‌డున్న ప్ర‌యాణికులు భ‌యంతో ప‌రుగులు తీశారు.

S

Hyderabad | Published On May 26, 2026, 12.52 pm IST

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బ‌స్సులో చెల‌రేగిన మంట‌లు.. ప‌రుగులు తీసిన ప్ర‌యాణికులు
Advertisement

MGBS | త్రినేత్ర‌.న్యూస్ : ఎంజీబీఎస్‌లో మంగ‌ళ‌వారం ఉద‌యం అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ప్లాట్‌ఫామ్‌పై నిలిపి ఉంచిన సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సు ముందు భాగంలో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో అక్క‌డున్న ప్ర‌యాణికులు భ‌యంతో ప‌రుగులు తీశారు. ప‌క్క‌నున్న బ‌స్సుల‌ను దూరంగా ఉంచారు.

ఆర్టీసీ సిబ్బంది అప్ర‌మ‌త్త‌మై మంట‌ల‌ను అదుపు చేసింది. ఈ ప్ర‌మాదంలో అటు ఆర్టీసీ సిబ్బందికి కానీ, ఇటు ప్ర‌యాణికుల‌కు ఎలాంటి ప్ర‌మాదం సంభ‌వించ‌లేదు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్ర‌మాదానికి గురైన బ‌స్సును గ‌ద్వాల డిపోకు చెందిన సూప‌ర్ ల‌గ్జ‌రీగా పోలీసులు గుర్తించారు.

అయితే అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. నిర్వ‌హ‌ణ లోప‌మా..? ఇత‌ర కార‌ణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో ఆర్టీసీ సిబ్బంది, పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

Advertisement
Advertisement