PhonePe | ఫోన్ పే రూ.10 పెట్టుబడి ఫీచర్కు విశేష రీతిలో స్పందన.. భారీగా పెరుగుతున్న కస్టమర్లు..
PhonePe | ఫోన్పే మ్యుచువల్ ఫండ్స్ తమ డైలీ ఎస్ఐపీ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) సేవ ప్రారంభించినప్పటి నుంచి విశేష ఆదరణ పొందుతోందని వెల్లడించింది. 2025 డిసెంబర్లో ప్రారంభమైన ఈ సేవ ద్వారా ఇప్పటివరకు 5 లక్షలకు పైగా ప్రత్యేక పెట్టుబడిదారులు చేరినట్లు తెలిపింది.
PhonePe | ఫోన్పే మ్యుచువల్ ఫండ్స్ తమ డైలీ ఎస్ఐపీ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) సేవ ప్రారంభించినప్పటి నుంచి విశేష ఆదరణ పొందుతోందని వెల్లడించింది. 2025 డిసెంబర్లో ప్రారంభమైన ఈ సేవ ద్వారా ఇప్పటివరకు 5 లక్షలకు పైగా ప్రత్యేక పెట్టుబడిదారులు చేరినట్లు తెలిపింది. ఇందులో దాదాపు 77 శాతం మంది టియర్ 2, టియర్ 3 నగరాలకు చెందినవారే కావడం విశేషం. దీంతో మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా చిన్న పట్టణాల్లోనూ మైక్రో ఇన్వెస్టింగ్పై ఆసక్తి పెరుగుతోందని సంస్థ పేర్కొంది. డైలీ ఎస్ఐపీ ద్వారా రోజుకు కేవలం రూ.10తోనే పెట్టుబడిని ప్రారంభించవచ్చని ఫోన్పే తెలిపింది. ఒకేసారి నెలకు పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా, రోజువారీగా చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా పెట్టుబడి చేసే అవకాశం ఈ ఫీచర్ కల్పిస్తుందని పేర్కొంది.
ఐదు రెట్లు పెరిగిన లావాదేవీలు..
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో డైలీ ఎస్ఐపీ లావాదేవీలు దాదాపు ఐదు రెట్లు పెరిగాయని సంస్థ వెల్లడించింది. సగటు పెట్టుబడి మొత్తం రూ.50గా నమోదైందని, ఇది క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి అలవాట్లపై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తిని ప్రతిబింబిస్తోందని తెలిపింది. ఈ ఉత్పత్తిని ఎక్కువగా యువత స్వీకరిస్తున్నట్లు ఫోన్పే వెల్లడించింది. డైలీ ఎస్ఐపీ పెట్టుబడిదారుల్లో 18 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల వారు 58 శాతం ఉండగా, 30 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు మరో 37 శాతం ఉన్నారు. తొలిసారి పెట్టుబడి పెట్టే వారు, ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన యువత ఈ సేవను అధికంగా వినియోగిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. రోజువారీ ఆదాయం పొందే వ్యాపారులు, దుకాణదారులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల్లో కూడా ఈ సేవకు మంచి ఆదరణ లభిస్తోందని ఫోన్పే తెలిపింది. నెలవారీ జీతంపై ఆధారపడకుండా రోజువారీ నగదు ప్రవాహానికి అనుగుణంగా చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండటం వారికి అనుకూలంగా మారిందని పేర్కొంది. అలాగే దీర్ఘకాలంలో కొనుగోలు సగటు ధరను సమతుల్యం చేసుకోవడంతో పాటు స్వల్పకాలిక మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని వివరించింది.
డైలీ ఎస్ఐపీల ద్వారా నెలకు ఒకేసారి పెద్ద మొత్తం డెబిట్ కాకుండా, రోజువారీ చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టే సౌలభ్యం లభిస్తుందని ఫోన్పే తెలిపింది. అవసరమైతే ఎలాంటి జరిమానా లేకుండానే పెట్టుబడులను ఎప్పుడైనా నిలిపివేసే వెసులుబాటు కూడా ఈ సేవలో ఉందని సంస్థ వెల్లడించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mutual Funds | మార్కెట్లు పతనమైనా, రాబడి తగ్గినా.. మ్యుచువల్ ఫండ్స్ను మార్చాలా..?
జులై 24, 2026

Mutual Funds | గత నెలలో ఈ కంపెనీ స్టాక్ను 40 మ్యుచువల్ ఫండ్స్ కొన్నాయి.. అత్యధిక డిమాండ్ ఉన్న షేర్ ఇదే..
జులై 22, 2026

Mutual Funds | మార్కెట్లో 4 కొత్త మ్యుచువల్ ఫండ్ స్కీమ్స్.. పెట్టుబడి రూ.500 మాత్రమే..
జులై 18, 2026
తాజావార్తలు
- ●Minister Uttam Kumar Reddy | రైతుల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం.. ప్రతీ గింజకూ లెక్క చెప్పాల్సిందే : మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి
- ●Kaloji Health University | విద్యార్థులకు అలర్ట్.. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ
- ●Faridabad Teacher | 30 సెకన్లలో 34 కత్తిపోట్లు.. స్కూల్ టీచర్పై వ్యక్తి పైశాచిక దాడి
- ●Penny Stocks | కాసుల వర్షం కురిపిస్తున్న పెన్నీ స్టాక్స్.. 6 నెలల్లో 198 శాతం లాభాలు..
- ●Harish Rao | డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్కు పూర్తి స్థాయి అధికారిని నియమించాలి.. హరీశ్ రావు డిమాండ్
- ●Minister Ponnam Prabhakar | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అభిప్రాయ సేకరణ చేపట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్

Minister Uttam Kumar Reddy | రైతుల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం.. ప్రతీ గింజకూ లెక్క చెప్పాల్సిందే : మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి

Kaloji Health University | విద్యార్థులకు అలర్ట్.. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ

Faridabad Teacher | 30 సెకన్లలో 34 కత్తిపోట్లు.. స్కూల్ టీచర్పై వ్యక్తి పైశాచిక దాడి

Penny Stocks | కాసుల వర్షం కురిపిస్తున్న పెన్నీ స్టాక్స్.. 6 నెలల్లో 198 శాతం లాభాలు..



