త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran War | ఇరాన్ యుద్ధంలో ఎనిమిది మంది భార‌తీయ పౌరులు మృతి : విదేశాంగ శాఖ‌

Iran War | ప‌శ్చిమాసియా (Middle East) యుద్ధంలో ఎనిమిది మంది భార‌తీయులు సైతం ప్రాణాలు కోల్పోయిన‌ట్లు (8 Indians died) ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఒక‌రు గ‌ల్లంతైన‌ట్లు తెలిపింది.

D

National | Published On Mar 31, 2026, 3.12 pm IST

Iran War | ఇరాన్ యుద్ధంలో ఎనిమిది మంది భార‌తీయ పౌరులు మృతి : విదేశాంగ శాఖ‌
Advertisement

Iran War | ప‌శ్చిమాసియా (Middle East)లో ఉద్రిక్త‌త‌లు మ‌రింత (Iran War) ముదిరాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల‌ను పెంచాయి. అదే స‌మ‌యంలో టెహ్రాన్ సైతం ఇజ్రాయెల్‌, గ‌ల్ఫ్ దేశాల‌పై ప్ర‌తీకార దాడుల‌ను కొన‌సాగిస్తోంది. ఇక నెల రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం కార‌ణంగా దాదాపు 3 వేల మందికిపైగానే ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయ‌ప‌డ్డారు. వేలాది మంది నిరాశ్ర‌యుల‌య్యారు. ఇక ఈ యుద్ధంలో ఎనిమిది మంది భార‌తీయులు సైతం ప్రాణాలు కోల్పోయిన‌ట్లు (8 Indians died) ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

మ‌ధ్య‌ప్రాచ్యంలో జ‌రిగిన వివిధ ఘ‌ట‌న‌ల్లో ఎనిమిది మంది భార‌తీయులు మ‌ర‌ణించిన‌ట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) స్ప‌ష్టం చేసింది. ఒక‌రు గ‌ల్లంతైన‌ట్లు తెలిపింది. "వివిధ ఘటనల్లో దురదృష్టవశాత్తూ ఎనిమిది మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో భారతీయుడు గల్లంతయ్యారు" అని పేర్కొంది. ఇక ఫిబ్ర‌వ‌రి 28న యుద్ధం ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి మ‌ధ్య‌ప్రాచ్యం నుంచి సుమారు 5.5 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణికులు భార‌త్‌కు తిరిగి వ‌చ్చిన‌ట్లు మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. గ‌ల్ఫ్‌, ప‌శ్చిమాసియా ప్రాంతంలో మారుతున్న ప‌రిస్థితుల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. వివాదం ముగింపు ప‌లికేందుకు చ‌ర్చ‌లు, దౌత్య‌మే మార్గ‌మ‌ని విదేశీ వ్య‌వ‌హారాల శాఖ ప్ర‌తినిధి ర‌ణ‌ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.

Also Read..

గాంధీ ఆస్ప‌త్రిలో అరుదైన స‌ర్జ‌రీ.. 2.8 కిలోల ప్లీహాం తొల‌గింపు

పారాసైలింగ్ చేస్తుండ‌గా తెగిపోయిన తాడు.. గోవా బీచ్‌లో టూరిస్ట్‌కు భ‌యాన‌క అనుభ‌వం

ఓటు వెయ్యి.. హ‌ల్వా తీసుకో.. వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టిన ఈసీ

Advertisement

తాజావార్తలు

Advertisement