త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gandhi Hospital | గాంధీ ఆస్ప‌త్రిలో అరుదైన స‌ర్జ‌రీ.. 2.8 కిలోల ప్లీహాం తొల‌గింపు

Gandhi Hospital | గాంధీ ఆస్ప‌త్రి వైద్యులు అరుదైన స‌ర్జ‌రీ నిర్వ‌హించి.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ మ‌హిళ ప్రాణాలు కాపాడారు. దీంతో గ‌త కొంత‌కాలంగా క‌డుపునొప్పితో బాధ‌ప‌డ్డ ఆమెకు ఉప‌శ‌మ‌నం క‌లిగింది.

S

Hyderabad | Published On Mar 31, 2026, 2.19 pm IST

Gandhi Hospital | గాంధీ ఆస్ప‌త్రిలో అరుదైన స‌ర్జ‌రీ.. 2.8 కిలోల ప్లీహాం తొల‌గింపు
Advertisement

Gandhi Hospital | త్రినేత్ర‌.న్యూస్ : గాంధీ ఆస్ప‌త్రి వైద్యులు అరుదైన స‌ర్జ‌రీ నిర్వ‌హించి.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ మ‌హిళ ప్రాణాలు కాపాడారు. దీంతో గ‌త కొంత‌కాలంగా క‌డుపునొప్పితో బాధ‌ప‌డ్డ ఆమెకు ఉప‌శ‌మ‌నం క‌లిగింది.

వారాసిగూడ‌కు చెందిన 43 ఏండ్ల గ‌త కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతోంది. ఇటీవ‌లి కాలంలో ఆమె క‌డుపు ఉబ్బడంతో కుటుంబ స‌భ్యులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. దీంతో ఆమెను కుటుంబ స‌భ్యులు గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాధితురాలికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా ప్లీహం వాపుకు గురైన‌ట్లు తేలింది. ప్లీహం వాపుకు గురికావ‌డంతో.. ఆమెలో ఎర్ర‌ర‌క్త క‌ణాలు, తెల్ల ర‌క్త‌క‌ణాలు, ప్లేట్‌లెట్స్ పూర్తిగా త‌గ్గిపోయాయి. భ‌విష్య‌త్‌లో ప్ర‌మాద‌క‌రంగా మారే అవ‌కాశం ఉంద‌ని భావించిన వైద్యులు.. ఆమెకు శ‌స్త్ర చికిత్స నిర్వ‌హించి, 2.8 కిలోల ప్లీహాన్ని తొల‌గించారు. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement