Indian Sailors | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారత నావికులు మృతి
Indian Sailors | ఒమన్ తీరంలో (Oman Coast) వాణిజ్య నౌకపై అమెరికా దాడి చేసింది (US Attack On Ship). ఈ దాడిలో ముగ్గురు భారతీయ సెయిలర్లు (Indian Sailors) మృతి చెందారు.
Indian Sailors | ఒమన్ తీరంలో (Oman Coast) వాణిజ్య నౌకపై అమెరికా దాడి చేసింది (US Attack On Ship). ఈ దాడిలో ముగ్గురు భారతీయ సెయిలర్లు (Indian Sailors) మృతి చెందారు. ఈ విషయాన్ని షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ (Shipping Minister Sarbananda Sonowal) ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇది చాలా విషాదకరమని.. ముగ్గురు నావికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
కాగా, పలావు దేశ పతాకంతో వెళ్తున్న 'సెట్టెబెల్లో' (Settebello) అనే చమురు ట్యాంకర్పై ఒమన్ గల్ఫ్లో అమెరికా సైనిక దాడి చేసిన విషయం తెలిసిందే. గత వారం ఈ దాడి జరిగింది. ఇరాన్ నుండి చమురును రవాణా చేస్తోందనే కారణంతో దీనిపై దాడి చేసినట్లు అమెరికా సైన్యం తెలిపింది. ఆ సమయంలో అందులో మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 24 మంది భారతీయ సిబ్బంది కాగా, విదేశీయుల్లో ఇద్దరు పాకిస్థానీలు, ఒకరు ఉక్రెయిన్ , రష్యా వ్యక్తి ఉన్నారు.
దాడి తర్వాత 21 మంది భారతీయ నావికులను ఒమన్ తీర రక్షణ దళం కాపాడింది. ముగ్గురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దురదృష్టవశాత్తూ గల్లంతైనట్లు భావించిన ఆ ముగ్గురు నావికులు మరణించినట్లు మంత్రి ఇవాళ వెల్లడించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబసభ్యులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
It is deeply unfortunate to learn of the tragic incident aboard the Palau-flagged MT Settebello. Sadly, three Indian seafarers initially reported missing are now confirmed dead after bodies have been located and identified.
This is a profound loss to our maritime family. The…
— Sarbananda Sonowal (@sarbanandsonwal) June 11, 2026
ఒమన్ తీరంలో మరోనౌకపై దాడి..
గల్ఫ్ ఆఫ్ ఒమన్లో నౌకలే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఒమన్లోని షినాస్ (Shinas) ఓడరేవు సమీపంలో ఒక వాణిజ్య నౌక లక్ష్యంగా దాడి జరిగినట్లు ఒమన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈరోజు తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్లు చెప్పింది. అయితే, అందుకు సంబంధించిన వివరాలను మాత్రం ఎంబసీ వెల్లడించలేదు. వారం రోజుల వ్యవధిలో ఒమన్ తీరంలో నౌకలపై జరిగిన మూడో దాడి ఇది.
Also Read..
తాజావార్తలు
- ●Ethanol Petrol | ఎథనాల్ పెట్రోల్ వినియోగదారులకు భారీ ఊరట.. ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు..
- ●Nipah Virus | కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం.. ఓ వ్యక్తికి పాజిటివ్
- ●TECNO POVA 8 5G | టెక్నో పోవా 8 5జీ వచ్చేసింది.. భారీ బ్యాటరీ, ఆకట్టుకుంటున్న ఏఐ ఫీచర్లు..
- ●Ramchandar Rao | ప్రజలు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నరు.. మనం కూడా సిద్ధం కావాలే
- ●SEBI | ఓయో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. మరో 4 కంపెనీలకూ అనుమతి..
- ●Indian Mangoes | భారతీయ మామిడి పండ్లపై నేపాల్ నిషేధం..? కేంద్రం క్లారిటీ

Ethanol Petrol | ఎథనాల్ పెట్రోల్ వినియోగదారులకు భారీ ఊరట.. ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు..

Nipah Virus | కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం.. ఓ వ్యక్తికి పాజిటివ్

TECNO POVA 8 5G | టెక్నో పోవా 8 5జీ వచ్చేసింది.. భారీ బ్యాటరీ, ఆకట్టుకుంటున్న ఏఐ ఫీచర్లు..

Ramchandar Rao | ప్రజలు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నరు.. మనం కూడా సిద్ధం కావాలే





