త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ethanol Petrol | ఎథనాల్ పెట్రోల్ వినియోగ‌దారుల‌కు భారీ ఊరట.. ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు..

Ethanol Petrol | ఎథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎథనాల్ కలిపిన పలు రకాల పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా మాఫీ చేస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మినహాయింపు ఇ22, ఇ25, ఇ27, ఇ30 రకాల ఎథనాల్-బ్లెండెడ్ పెట్రోల్‌కు వర్తిస్తుంది.

S

Business | Published On Jun 11, 2026, 2.51 pm IST

Ethanol Petrol | ఎథనాల్ పెట్రోల్ వినియోగ‌దారుల‌కు భారీ ఊరట.. ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు..
Advertisement

Ethanol Petrol | ఎథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎథనాల్ కలిపిన పలు రకాల పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా మాఫీ చేస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మినహాయింపు ఇ22, ఇ25, ఇ27, ఇ30 రకాల ఎథనాల్-బ్లెండెడ్ పెట్రోల్‌కు వర్తిస్తుంది. నోటిఫికేషన్ ప్రకారం 22, 25, 27, 30 శాతం ఎథనాల్ మిశ్రమం కలిగిన పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ నిల్ గా నిర్ణయించారు. ఎథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగాన్ని పెంచడం, వినియోగదారులను పర్యావరణహిత ఇంధనాల వైపు మళ్లించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో భవిష్యత్తులో ఎథనాల్ ఆధారిత ఇంధనాలకు మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది.

ఇంధ‌న ధ‌ర‌ల అదుపుకు చ‌ర్య‌లు..

ఇటీవల మే ద్వితీయార్థంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు దాదాపు రూ.7.50 మేర పెరగడం నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపడుతోంది. అంతకుముందు మార్చిలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. ఈ నిర్ణయం కారణంగా ప్రభుత్వానికి ఏటా రూ.1 లక్ష కోట్లకు పైగా ఆదాయం కోల్పోయే పరిస్థితి ఏర్పడినప్పటికీ, పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయ వినియోగదారులను రక్షించేందుకు ఆ చర్య తీసుకుంది.

Advertisement
Advertisement