PM Modi | ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. నన్ను క్షమించండి అంటూ వీడియో రిలీజ్ చేసిన 15 ఏళ్ల బాలిక
PM Modi | నీట్ పేపర్ లీక్ ఘటనను నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరిగిన ఆందోళనల (CJP protests) సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ 15 ఏళ్ల బాలిక క్షమాపణలు (apology) చెప్పింది.
PM Modi | త్రినేత్ర.న్యూస్ : నీట్ పేపర్ లీక్ ఘటనను నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరిగిన ఆందోళనల (CJP protests) సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ 15 ఏళ్ల బాలిక క్షమాపణలు (apology) చెప్పింది. తన స్నేహితులతో కలిసి నిరసనల్లో పాల్గొన్నట్లు తెలిపింది. చుట్టుపక్కల వారి ప్రభావంతోనే తాను అలా మాట్లాడానంటూ వివరణ ఇచ్చింది.
"నా వయస్సు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. నా స్నేహితులతో కలిసి నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్లా. చుట్టుపక్కల వాళ్ల ప్రభావంతోనే ప్రధానిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడాను. నేను చేసింది క్షమించరాని తప్పు. నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. నాకు చాలా సిగ్గుగా ఉంది. నాపై నాకే అసహ్యంగా ఉంది. ఇది నా జీవితంలో మొదటి, చివరి తప్పు. దేశ ప్రజలందరికీ చేతులు జోడించి క్షమాపణలు కోరుతున్నాను. దయచేసి నన్ను క్షమించండి" అంటూ సదరు బాలిక పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
వాళ్లు మన పిల్లలు.. వారిని క్షమిస్తున్నా : ప్రధాని మోదీ
అంతకుముందు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నిరసన సందర్భంగా తనను దూషించిన విద్యార్థులను క్షమిస్తున్నట్లు చెప్పారు. వారు మన పిల్లలని.. తప్పులు చేయడం సహజమేనని పేర్కొన్నారు. వారిని శిక్షించడం కంటే సరైన మార్గంలో నడిపించడం సమాజం బాధ్యత అని పేర్కొన్నారు.
జంతర్ మంతర్ వద్ద ఏం జరిగిందో దేశం మొత్తం చూసిందన్నారు. కొంతమంది ఆకతాయిలు అసభ్యకర పదజాలంతో దూషించారని ప్రధాని వాపోయారు. వారి మాటలు తగవని పేర్కొన్నారు. తనని, తన దివంగత తల్లిని కూడా దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లంతా దారి తప్పారని.. సరైన మార్గంలో పెట్టాలన్నారు. అవమానాలు ఏ సమస్యను పరిష్కరించవని ప్రధాని చెప్పుకొచ్చారు. యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ వీడియో సందేశం తర్వాత కొన్ని గంటలకే 15 ఏళ్ల బాలిక క్షమాపణ వీడియో బయటకు రావడం గమనార్హం.
Also Read..
ఏబీబీ ఇండియా భారీ డివిడెండ్.. ఒక్కో షేరుకు రూ.90.. రికార్డ్ డేట్ ఎప్పుడంటే..
11,403 పోస్టులతో ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్.. తెలంగాణలో ఖాళీలు ఎన్నంటే?
సంబంధిత వార్తలు

PM Modi | ఇన్ఫ్ల్యూయెన్సర్ల మాయలో పడొద్దు.. యువతకు మోదీ కీలక సందేశం
ఆగస్టు 12, 2026

Parliament Monsoon Session | రివర్స్ ఎటాక్.. జార్ఖ్ండ్ నిరసనలపై రాహుల్ సమాధానం చెప్పాలి.. ఎన్డీయే ఎంపీల నిరసన
ఆగస్టు 11, 2026

Sonia Gandhi | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది : సోనియా గాంధీ
ఆగస్టు 11, 2026
తాజావార్తలు
- ●Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?
- ●Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన
- ●Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్
- ●Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్ఫోన్కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..
- ●Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు సెగ.. భారీ నష్టాల్లో సూచీలు..

Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?

Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన

Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్

Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్ఫోన్కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..



