త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Upendra Dwivedi | ప్ర‌పంచ ప‌టంలో ఉండాలో లేదో వారే నిర్ణ‌యించుకోవాలి.. పాక్‌కు ఆర్మీచీఫ్ వార్నింగ్‌

Upendra Dwivedi | పాకిస్థాన్ (Pakistan)కు ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఉపేంద్ర ద్వివేది (Army Chief Gen Upendra Dwivedi) మ‌రోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. "ప్ర‌పంచ ప‌టంలో ఉండాల‌నుకుంటున్నారా..? లేక చ‌రిత్ర‌లో మిగిలిపోవాల‌నుకుంటున్నారా..?" అంటూ తీవ్ర‌స్వ‌రంతో హెచ్చ‌రించారు.

D

National | Published On May 16, 2026, 1.25 pm IST

Upendra Dwivedi | ప్ర‌పంచ ప‌టంలో ఉండాలో లేదో వారే నిర్ణ‌యించుకోవాలి.. పాక్‌కు ఆర్మీచీఫ్ వార్నింగ్‌
Advertisement

Upendra Dwivedi | సీమాంత ఉగ్ర‌వాదాన్ని పొంచి పోషిస్తోన్న దాయాది పాకిస్థాన్ (Pakistan)కు ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఉపేంద్ర ద్వివేది (Army Chief Gen Upendra Dwivedi) మ‌రోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించడం కొనసాగిస్తే.. తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. "ప్ర‌పంచ ప‌టంలో ఉండాల‌నుకుంటున్నారా..? లేక చ‌రిత్ర‌లో మిగిలిపోవాల‌నుకుంటున్నారా..?" అంటూ తీవ్ర‌స్వ‌రంతో హెచ్చ‌రించారు.

ఢిల్లీలోని మానెక్‌షా సెంటర్‌లో 'యూనిఫాం అన్‌వీల్డ్' (Uniform Unveiled) నిర్వ‌హించిన‌ ఇంట‌రాక్టివ్ సెష‌న్‌లో ఆర్మీ చీఫ్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా గ‌తేడాది 'ఆపరేషన్ సింధూర్' (Operation Sindoor)కు దారితీసిన ప‌రిస్థితులు మ‌ళ్లీ ఎదురైతే.. భార‌త సైన్యం ఎలా స్పందిస్తుంది అని అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధాన‌మిచ్చారు. నేను ఇంతకు ముందు చెప్పింది మీరు వినే ఉంటారు.. పాకిస్థాన్ గనుక ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేయడం కొనసాగిస్తే తీవ్ర ప‌రిణాలు త‌ప్ప‌వు. వారు ప్ర‌పంచ ప‌టంలో ఉండాలా..? లేదా చరిత్రలో మిగిలిపోవాలా..? అనేది వారే నిర్ణయించుకోవాలి" అని అన్నారు.

గ‌తేడాది ప‌హ‌ల్గామ్‌లో జ‌రిగిన ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా మ‌న ద‌ళాలు గ‌తేడాది మే 7వ తేదీన పాక్‌పై ఆప‌రేష‌న్ సింధూర్ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. స‌రిహ‌ద్దు ఆవ‌ల ఉన్న‌ పాక్‌, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోని ఉగ్ర‌స్థావ‌రాల‌పై ఖచ్చితమైన లక్ష్యాలతో విరుచుప‌డ్డాయి. ఈ దాడిలో ఉగ్ర‌స్థావ‌రాలు ధ్వంస‌మ‌య్యాయి. ఆ త‌ర్వాత దాయాది కూడా మ‌న‌దేశంపై దాడులకు దిగింది. ఆ దాడుల్ని మ‌న సైన్యం స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్టింది. ఇరు దేశాల మధ్య దాదాపు 88 గంటల పాటూ సైనిక ఘ‌ర్ష‌ణ‌లు కొన‌సాగాయి. ఆ త‌ర్వాత‌ మే 10 సాయంత్రం ఇరుపక్షాల మధ్య కాల్పుల విర‌మ‌ణ కుద‌ర‌డంతో ఘ‌ర్ష‌ణ‌లు ముగిశాయి. అయితే, అప్ప‌టికే పాక్‌కు జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. పాక్ కీల‌క‌మైన ఎయిర్‌బేస్‌లు చాలా వ‌ర‌కూ ధ్వంస‌మ‌య్యాయి.

Also Read..

ఐసిస్‌కు బిగ్ షాక్‌.. టాప్‌ కమాండ‌ర్ అబు బిలాల్ మినూకీ హ‌తం.. ప్ర‌క‌టించిన ట్రంప్‌

ఢిల్లీ ప్రెస్‌మీట్‌లో జ‌ర్న‌లిస్ట్‌పై ర‌ష్యా విదేశాంగ మంత్రి అస‌హ‌నం.. తుపాకీ తీయాల్సి వ‌స్తుందంటూ హెచ్చ‌రిక‌

భార‌తీయ రైల్వేలో 11,127 అసిస్టెంట్‌ లోక్‌పైల‌ట్ పోస్టులు.. సికింద్రాబాద్ జోన్‌లో ఖాళీలు?

Advertisement
Advertisement