త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

White House | పాక్ వేదిక‌గా అమెరికా-ఇరాన్ శాంతి చ‌ర్చ‌లు..? క్లారిటీ ఇచ్చిన వైట్‌హౌస్‌

White House | అమెరికా-ఇరాన్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించేందుకు పాకిస్థాన్ (Pakistan) మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై అమెరికా అధ్య‌క్ష కార్యాల‌యం వైట్‌హౌస్ (White House) తాజాగా స్పందించింది. ఆ వార్త‌ల‌ను తీవ్రంగా ఖండించింది.

D

International | Published On Mar 24, 2026, 12.49 pm IST

White House | పాక్ వేదిక‌గా అమెరికా-ఇరాన్ శాంతి చ‌ర్చ‌లు..? క్లారిటీ ఇచ్చిన వైట్‌హౌస్‌
Advertisement

White House | అమెరికా-ఇరాన్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించేందుకు పాకిస్థాన్ (Pakistan) మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ వార‌మే ఇరాన్‌-అమెరికా (Iran - US officials meeting ) మ‌ధ్య‌ శాంతి చర్చలు ఇస్లామాబాద్ వేదిక‌గా జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని నివేదిక‌లు సూచిస్తున్నాయి. ఈ చ‌ర్చ‌ల‌కు అమెరికా ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధులు స్టీవ్‌ విట్కాఫ్‌, జారెడ్‌ కుష్నెర్‌లు త్వరలో ఇరాన్‌ ప్రతినిధులతో పాక్ వేదిక‌గా భేటీ కాబోతున్నారంటూ అంత‌ర్జాతీయ నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో దీనిపై అమెరికా అధ్య‌క్ష కార్యాల‌యం వైట్‌హౌస్ (White House) తాజాగా స్పందించింది. ఆ వార్త‌ల‌ను తీవ్రంగా ఖండించింది.

ఇరాన్ ప్రతినిధులతో చర్చలపై అమెరికా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ (Karoline Leavitt) తెలిపారు. ఇవి అత్యంత సున్నితమైన దౌత్యపరమైన చర్చలు అని పేర్కొన్నారు. వైట్‌హౌస్ అధికారికంగా ప్ర‌క‌టించే వ‌ర‌కూ ఈ చ‌ర్చ‌లపై వ‌చ్చే ఊహాగానాల‌ను ఎవరూ నమ్మొద్దని సూచించారు. వాటిని తుది నిర్ణ‌యాలుగా ప‌రిగ‌ణించ‌కూడద‌ని పేర్కొన్నారు.

ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని, ఆ దేశ విద్యుత్ కేంద్రాలపై చేయాలనుకున్న దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమ‌వారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై సైనిక దాడులను 5 రోజుల పాటు వాయిదా వేయాలని రక్షణ శాఖను ఆదేశించినట్లు ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రంప్ ఈ ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత ఓ కీల‌క అంశం తెరపైకి వ‌చ్చింది. అమెరికా-ఇరాన్ మ‌ధ్య శాంతి చ‌ర్య‌ల‌కు పాకిస్థాన్ వేదిక కానున్న‌ట్లు వార్త‌లు వెలువ‌డ్డాయి. ఈ రెండు దేశాల మ‌ధ్య స‌యోధ్య కుదిర్చేందుకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తున్న‌ట్లు అంత‌ర్జాతీయ మీడియా పేర్కొంది. ట్రంప్‌తో ఆసిమ్ మునీర్ చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లుగా కూడా వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలోనే ఆ వార్త‌ల‌పై వైట్‌హౌస్ క్లారిటీ ఇచ్చింది.

Also Read..

విద్యా క‌మిష‌న్ సిఫార‌సు 18 శాతం.. కేటాయింపు 8 శాత‌మా? : బీఆర్ఎస్‌వీ

బ‌హ్రెయిన్‌లోని AWS డేటా సెంట‌ర్‌పై మ‌రోసారి దాడి

స్క్రాపేజీ పాలసీని విజయవంతంగా అమలు చేస్తున్నాం: పొన్నం

Advertisement

తాజావార్తలు

Advertisement