Drone Strike Near US Consulate | దుబాయ్లోని యూఎస్ ఎంబసీపై ఇరాన్ డ్రోన్ దాడి.. ఎగసిపడ్డ మంటలు
Drone Strike Near US Consulate | దుబాయ్ (Dubai)లోని యూఎస్ ఎంబసీ (US Consulate) లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది Drone Strike Near US Consulate). దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.
International | Published On Mar 4, 2026, 10.12 am IST
Drone Strike Near US Consulate | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఇరాన్ (Iran)పై అమెరికా సేనలు విరుచుకుపడుతున్నాయి. అదే సమయంలో ఇరాన్ సైతం ఎదురుదాడిని కొనసాగిస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలే లక్ష్యంగా డ్రోన్లతో దాడి చేస్తోంది. తాజాగా దుబాయ్ (Dubai)లోని యూఎస్ ఎంబసీ (US Consulate) లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది Drone Strike Near US Consulate). దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని స్థానిక మీడియా వెల్లడించింది.
ఇక ఈ దాడిని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో ధృవీకరించారు. సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. "దురదృష్టవశాత్తూ ఒక డ్రోన్ కాన్సులేట్ భవనం పక్కన ఉన్న పార్కింగ్ ప్లేస్ను ఢీ కొట్టింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు" అని ఆయన వాషింగ్టన్లో విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. మరోవైపు దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
కాగా, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ ఎదురుదాడులు కొనసాగిస్తోంది. గల్ఫ్ దేశాలైన దుబాయ్, రియాద్, కువైట్, యూఏఈ, ఖతార్, బెహ్రెయిన్, సౌదీ దేశాల్లోని అమెరికా దౌత్య కార్యాలయాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడుతోంది. డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. సోమ, మంగళవారాల్లో కువైట్, రియాద్లోని యూఎస్ ఎంబసీలపై డ్రోన్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దుబాయ్లోని దౌత్య కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడింది.
Also Read..
Social Media | బోగస్ అకౌంట్ క్రియేట్ చేసి.. నటిపై అసభ్య పోస్టులు.. యాక్టర్ అరెస్టు
Apple M5 MacBooks | ఎం5 చిప్లతో సరికొత్త మాక్బుక్లు.. ధర రూ1,19,900తో మొదలు..
Fire Accident | బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. 50 ఫర్నీచర్ షాపులు దగ్ధం
తాజావార్తలు
- ●Kommidi Narasimha Reddy | భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి ఇకలేరు
- ●PMAY Urban 2.0 | ఇంటి రుణంపై రూ.1.80 లక్షల సబ్సిడీ.. కేంద్ర పథకం పూర్తి వివరాలు..
- ●PM Modi | ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం బింటాంగ్ ఆదిపుర్ణ
- ●Revanth Reddy | రేవంత్ కీలక నిర్ణయం.. సీఎంవో అధికారులకు శాఖల కేటాయింపు
- ●Concrete mixer operators protest | కాంక్రీట్ మిక్సర్స్ ఆపరేటర్ల ఆందోళన.. ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- ●Microsoft Layoffs | మైక్రోసాఫ్ట్లో భారీ లేఆఫ్స్.. వ్యాపారం బాలేదంటూ ఉద్యోగులకు లేఖ రాసిన ఎక్స్బాక్స్ సీఈవో

Kommidi Narasimha Reddy | భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి ఇకలేరు

PMAY Urban 2.0 | ఇంటి రుణంపై రూ.1.80 లక్షల సబ్సిడీ.. కేంద్ర పథకం పూర్తి వివరాలు..

PM Modi | ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం బింటాంగ్ ఆదిపుర్ణ

Revanth Reddy | రేవంత్ కీలక నిర్ణయం.. సీఎంవో అధికారులకు శాఖల కేటాయింపు






