త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Armys Helicopter Crashes | పీవోకేలో కూలిన ఆర్మీ హెలికాప్ట‌ర్‌.. 21 మంది భ‌ద్ర‌తా సిబ్బంది మృతి

Armys Helicopter Crashes | పాకిస్థాన్‌లో (Pakistan) ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. పాక్ ఆర్మీకి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ కూలి 21 మంది భ‌ద్ర‌తా సిబ్బంది మ‌ర‌ణించారు.

D

International | Published On Jun 10, 2026, 5.05 pm IST

Armys Helicopter Crashes | పీవోకేలో కూలిన ఆర్మీ హెలికాప్ట‌ర్‌.. 21 మంది భ‌ద్ర‌తా సిబ్బంది మృతి
Advertisement

Armys Helicopter Crashes | పాకిస్థాన్‌లో (Pakistan) ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. పాక్ ఆర్మీకి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌ (PoK)లో కూలిపోయింది (Armys Helicopter Crashes). ఈ ఘ‌ట‌న‌లో 21 మంది భ‌ద్ర‌తా సిబ్బంది మ‌ర‌ణించారు.

ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం.. ఈ హెలికాప్ట‌ర్ పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోని నీలం వ్యాలీ సెక్టార్‌కు (Neelum Valley sector) అద‌న‌పు బ‌ల‌గాల‌ను త‌ర‌లిస్తోంది. ఈ క్ర‌మంలో పీవోకే స‌మీపంలోని ముజ‌ఫ‌రాబాద్‌లో (Muzaffarabad) టేకాఫ్ అయిన కాసేప‌టికే హెలికాప్ట‌ర్‌లో సాంకేతిక లోపం త‌లెత్తిన‌ట్లు అధికారులు గుర్తించారు. వెంట‌నే ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్ర‌త్నిస్తుండ‌గా.. అది ఒక్క‌సారిగా కూలిపోయిన‌ట్లు తెలిపారు. ఈ ప్ర‌మాదంలో అందులో ఉన్న 21 మంది భ‌ద్ర‌తా సిబ్బంది మ‌ర‌ణించారు. స‌మాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Also Read..

దీదీని ప్ర‌ధానిగా చూడాల‌నుకుంది.. క‌ట్‌చేస్తే ఆ పార్టీలో భ‌విష్య‌త్తే లేదంటూ రెబ‌ల్ గ్రూప్‌లో చేరిన ఎంపీ

కాంగ్రెస్‌ పార్టీ అత్యవసర సమావేశం.. త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రుకావాలంటూ ఆదేశం

ఘనా పారిశ్రామికాభివృద్ధికి ‘తెలంగాణ’ మార్గనిర్దేశం

Advertisement
Advertisement