త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident in USA | అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం.. రంగారెడ్డి జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మృతి

Road Accident in USA | అమెరికాలోని న్యూజెర్సీలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన మ‌హిళ ప్రాణాలు కోల్పోయారు. శ్రీ‌పాతి దీపారెడ్డి (44) కారులో ప్ర‌యాణిస్తూ ఓ సిగ్న‌ల్ వ‌ద్ద ఆగిన స‌మ‌యంలో మ‌రో గుర్తుతెలియ‌ని కారు వేగంగా వ‌చ్చి ఆమె కారును ఢీకొట్టింది.

S

Telangana | Published On Jul 28, 2026, 4.08 pm IST

Road Accident in USA | అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం.. రంగారెడ్డి జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మృతి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: అమెరికాలోని న్యూజెర్సీలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన మ‌హిళ ప్రాణాలు కోల్పోయారు. శ్రీ‌పాతి దీపారెడ్డి (44) కారులో ప్ర‌యాణిస్తూ ఓ సిగ్న‌ల్ వ‌ద్ద ఆగిన స‌మ‌యంలో మ‌రో గుర్తుతెలియ‌ని కారు వేగంగా వ‌చ్చి ఆమె కారును ఢీకొట్టింది. తీవ్ర గాయాల‌పాలైన ఆమె మృతి చెందిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. దీపారెడ్డి అకాల మ‌ర‌ణంతో ఆమె స్వ‌గ్రామ‌మైన‌ రంగారెడ్డి జిల్లాలోని ఆమ‌న‌గ‌ల్లు మండ‌లం ఆకుతోట‌ప‌ల్లిలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

కుటుంబ స‌భ్యుల ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి. మాడుగుల మండల కేంద్రానికి చెందిన పట్టాభి శేఖర్ రెడ్డి, శశిరేఖ దంపతుల కుమార్తె అయిన దీపారెడ్డికి 20 ఏళ్ల కిందట ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లికి చెందిన రామకృష్ణారెడ్డితో పెళ్లి జ‌రిగింది. వృత్తిరీత్యా ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లే కావ‌డంతో అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో స్థిరపడ్డారు. ఇదిలా ఉండ‌గా సోమ‌వారం దీపారెడ్డి కారులో వెళ్తూ సిగ్నల్ వద్ద ఆగింది. మరో కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆమె మృతి చెందింది అని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా దీపారెడ్డి, రామ‌కృష్ణారెడ్డి దంప‌తుల‌కు ఇద్దరు కూతుళ్లు సంస్కృత, హర్షిత ఉన్నారు.

Advertisement
Advertisement