PM Modi | భారతీరాజా మృతి సినీ రంగానికి తీరని లోటు : ప్రధాని మోదీ
PM Modi | తమిళ దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీ రాజా (Bharathiraja) మృతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Entertainment | Published On Jun 11, 2026, 11.53 am IST
PM Modi | తమిళ దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీ రాజా (Bharathiraja) మృతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సినీ రంగానికి భారతీరాజా చేసిన సేవలను మోదీ గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం సినీపరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ పెట్టారు.
భారతీరాజా మరణం తీవ్ర బాధను కలిగించిందన్నారు. చలనచిత్ర ప్రపంచంలో మహోన్నత వ్యక్తి అని, ఆయన సినిమాలు తమిళ సినీ రంగాన్ని కొత్త దిశగా నడిపించాయని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఈ కఠిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రధాని మోదీ తన పోస్టులో రాసుకొచ్చారు.
The passing of Thiru Bharathiraja Ji is very saddening. He was a towering figure of the cinema world whose works transformed Tamil cinema. Particularly noteworthy was his portrayal of rural life. My thoughts are with his family and admirers in this hour of grief. Om Shanti.
— Narendra Modi (@narendramodi) June 11, 2026
85 ఏండ్ల భారతీ రాజా గత కొంతకాలంగా శ్వాస సంబంధింత సమస్యలతో బాధపడుతున్నారు. చెన్నైలోని దవాఖానాలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. 1941 జూలై 17న జన్మించారు. ఆయన తెరకెక్కించిన పదహారేళ్ల వయసు, సీతాకోక చిలుక, ఆరాధన సినిమాలకు జాతీయ అవార్డులు అందుకున్నారు. భారతీరాజా దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా పలు చిత్రాల్లో ఆకట్టుకున్నారు.
Also Read..
ఎల్ నినో ప్రభావం.. రుతుపవనాలకు అంతరాయం
ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రారంభమైన నీతి ఆయోగ్ భేటీ
హర్మూజ్ను పూర్తిగా మూసేసిన ఇరాన్.. ఇంధన ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్..?
తాజావార్తలు
- ●Ramchandar Rao | ప్రజలు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నరు.. మనం కూడా సిద్ధం కావాలే
- ●SEBI | ఓయో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. మరో 4 కంపెనీలకూ అనుమతి..
- ●Indian Mangoes | భారతీయ మామిడి పండ్లపై నేపాల్ నిషేధం..? కేంద్రం క్లారిటీ
- ●Indian Sailors | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారత నావికులు మృతి
- ●Trains Cancelled | ప్రయాణికులకు అలర్ట్.. ఈ రూట్లలో రైళ్లు రద్దు
- ●Jupally Krishna Rao | గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం.. ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు : మంత్రి జూపల్లి

Ramchandar Rao | ప్రజలు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నరు.. మనం కూడా సిద్ధం కావాలే

SEBI | ఓయో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. మరో 4 కంపెనీలకూ అనుమతి..

Indian Mangoes | భారతీయ మామిడి పండ్లపై నేపాల్ నిషేధం..? కేంద్రం క్లారిటీ

Indian Sailors | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారత నావికులు మృతి






