Jeevan Reddy | జీవన్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ
Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevan Reddy) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. హస్తం పార్టీ నేతలు ఆయన్ని బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevan Reddy) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. హస్తం పార్టీ నేతలు ఆయన్ని బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు మంత్రులు జీవన్ రెడ్డితో పలుమార్లు భేటీ అవ్వగా.. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) రంగంలోకి దిగారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్తో కలిసి జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు.
ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్తో కలిసి ఇవాళ ఉదయం జగిత్యాల పట్టణంలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లిన మహేష్ కుమార్ గౌడ్ ఆయనతో చర్చలు జరుపుతున్నారు. అంతకు ముందు తన నివాసానికి వచ్చిన నేతలకు జీవన్ రెడ్డి ఎదురెళ్లి మరీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నేతలు జీవన్ రెడ్డితో తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. పార్టీ వీడకుండా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా, గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీపై జీవన్ రెడ్డి తన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అదే రోజు కార్యకర్తలతో సమావేశమై తదుపరి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ఆయన వెల్లడించారు. "నాకు జరిగిన అన్యాయంలో సీఎం రేవంత్ రెడ్డికి భాగం ఉంది. పార్టీ ఫిరాయింపుల వల్ల రాహుల్ గాంధీ ఆశయాలకు విఘాతం కలుగుతుంది. రాహుల్ కంటే రేవంత్ రెడ్డి పార్టీకి ఎక్కువయ్యాడు. గత 20 నెలలుగా పార్టీలో మానసిక క్షోభకు గురవుతున్నాను. అవమానాలకు గురవుతూ పార్టీలో కొనసాగలేని పరిస్థితి. అందరి సలహాలు, సూచనలతో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను. నా రాజకీయ ప్రస్థానంలో మీ తోడు, మార్గదర్శనం కావాలి. ఏది ఏమైనా ప్రజల్లోనే ఉంటాను. ప్రజలకు ఎక్కువగా ఏ పార్టీ లాభం చేస్తుందనుకుంటుందో దాని వెంటే నా ప్రయాణం సాగుతుంది" అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read..
రూ.2.90 లక్షల గ్రాఫిక్ కార్డును ఆర్డర్ చేస్తే.. కిలోన్నర డిటర్జెంట్ పౌడర్ వచ్చింది..
పాతబస్తీలో ఉద్రిక్తత.. వేట కొడవలితో యువకుడి హల్చల్
శ్రీరామనవమి శోభాయాత్ర.. 3000 మంది పోలీసులతో భద్రత.. డ్రోన్లతో పర్యవేక్షణ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



