త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

New Pensions | గుడ్‌న్యూస్‌.. పంద్రాగస్టు నుంచి కొత్త పింఛన్లు..

New Pensions | కొత్త పింఛ‌న్ల కోసం (New Pensions) ఎదురుచూస్తున్నవారికి ప్ర‌భుత్వం శుభ‌వార్త అందించింది. చేయూత ప‌థ‌కం (Cheyutha Pension Scheme) కింద రాష్ట్రంలోని అర్హులంద‌రికి ఆగ‌స్టు 15 (August 15th) నుంచి కొత్త పెన్ష‌న్లు పంపిణీ చేయ‌నుంది.

G

Telangana | Published On Jul 31, 2026, 8.05 am IST

New Pensions | గుడ్‌న్యూస్‌.. పంద్రాగస్టు నుంచి కొత్త పింఛన్లు..
Advertisement

New Pensions | త్రినేత్ర‌.న్యూస్‌: కొత్త పింఛ‌న్ల కోసం (New Pensions) ఎదురుచూస్తున్నవారికి ప్ర‌భుత్వం శుభ‌వార్త అందించింది. చేయూత ప‌థ‌కం (Cheyutha Pension Scheme) కింద రాష్ట్రంలోని అర్హులంద‌రికి ఆగ‌స్టు 15 (August 15th) నుంచి కొత్త పెన్ష‌న్లు పంపిణీ చేయ‌నుంది. ఈ మేర‌కు అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశాలు జారీచేశారు. అర్హుల గుర్తింపు ప్రక్రియ వెంటనే చేపట్టాలన్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ ఇవ్వాలని సూచించారు. థలసీమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితులకు సైతం ప్ర‌త్యేక ప్రాధాన్య‌త కింద పింఛ‌న్లు మంజూరు చేయాలన్నారు. దివ్యాంగులు మరణిస్తే ఎలాంటి జాప్యం చేయకుండా వారి భార్యలకు తక్షణమే పింఛన్లు బ‌దిలీ చేయాల‌న్నారు. ఈ విష‌యంలో ఎటువంటి జాప్యానికి తావివ్వద్ద‌న్నారు.

కోటి మంది మ‌హిళ‌ల‌కు పంపిణీ చేసే చీర‌లు పూర్తి నాణ్య‌త‌తో, ఆక‌ట్టుకునే డిజైన్ల‌లో ఉండాల‌ని చెప్పారు. డిజైన్ల రూప‌క‌ల్ప‌న‌కు ఎన్ఐఎఫ్‌టీ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాల‌ని తెలిపారు. ఇందిర‌మ్మ చీర‌లకు (Indiramma Sarees)  మ‌హిళ‌ల నుంచి మంచి స్పంద‌న రావ‌డంతో నాణ్య‌త‌, రంగుల విష‌యంలో రాజీప‌డొద్ద‌ని సూచించారు.

Advertisement
Advertisement