త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. మెట్రో రెండో ద‌శ ప‌నుల‌పై కేంద్ర మంత్రితో చ‌ర్చ‌లు

CM Revanth Reddy | ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హ‌స్తిన (Delhi)కు చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం 4:30 గంట‌ల త‌ర్వాత కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌తో భేటీ కానున్న‌ట్లు తెలిసింది.

D

Telangana | Published On May 6, 2026, 1.31 pm IST

CM Revanth Reddy | ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. మెట్రో రెండో ద‌శ ప‌నుల‌పై కేంద్ర మంత్రితో చ‌ర్చ‌లు
Advertisement

CM Revanth Reddy | ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హ‌స్తిన (Delhi)కు చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం 4:30 గంట‌ల త‌ర్వాత కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌తో భేటీ కానున్న‌ట్లు తెలిసింది. హైద‌రాబాద్ మెట్రో ప్ర‌భుత్వ‌ప‌రం అయిన‌ట్లు కేంద్ర మంత్రికి స‌మాచారం ఇచ్చే అవ‌కాశం ఉంది. అదేవిధంగా ప్ర‌తిపాదిత మెట్రో రెండో ద‌శ‌కు (Hyderabad Metro phase II) అనుమ‌తులు ఇవ్వ‌డంతోపాటూ.. స‌హ‌కారం అందించాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోర‌నున్నారు.

ఎల్అండ్‌టీతో సెటిల్‌మెంట్ పూర్తి చేయాల‌ని గ‌తంలో సీఎంకు కేంద్ర మంత్రి సూచించారు. సెటిల్‌మెంట్ పూర్తి త‌ర్వాతే కేంద్రం జోక్యం చేసుకుంటుంద‌ని అప్ప‌ట్లోనే సీఎంకు మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. కేంద్రం సూచించిన విధంగా.. ఇప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వం చేతికి మెట్రో రావ‌డంతో రెండోద‌శ‌పై మ‌రోసారి కేంద్రానికి సీఎం విజ్ఞ‌ప్తి చేయ‌నున్నారు. కేంద్ర మంత్రితో భేటీ అనంత‌రం కాంగ్రెస్ పెద్ద‌ల‌తో సీఎం రేవంత్ స‌మావేశం కానున్న‌ట్లు తెలుస్తోంది. కేర‌ళంలో పార్టీ గెలుపు, త‌దిత‌ర ప‌రిణామాల‌పై చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం.

Also Read..

సాధార‌ణ మ‌హిళ‌లా దిల్‌సుఖ్‌న‌గ‌ర్ బ‌స్టాండ్‌లో సీపీ సుమ‌తి.. వేధించిన పోకిరీలు..

తెలంగాణ‌లో మ‌ళ్లీ వాన‌లు.. హెచ్చ‌రించిన వాతావ‌ర‌ణ‌శాఖ‌..!

విజ‌య్‌ని ఆహ్వానించిన గ‌వ‌ర్న‌ర్‌.. సీఎంగా ఆ ఫైల్‌పైనే తొలిసంత‌కం..!

Advertisement
Advertisement