త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RTC Bus Accident | కొర్ల‌ప‌హ‌డ్ వ‌ద్ద రెండు బ‌స్సులు ఢీ.. ప‌లురుకి గాయాలు

న‌ల్ల‌గొండ జిల్లా కేతేప‌ల్లి మండ‌లం కొర్ల‌ప‌హాడ్ (Korlapahad) వ‌ద్ద రోడ్డు ప్ర‌మాదం (RTC Bus Accident) జ‌రిగింది. జాతీయ ర‌హ‌దారిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తిరువూరు డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సు (RTC Bus), ముందు వెళ్తున్న మ‌రో బ‌స్సును ఢీకొట్టింది.

G

Telangana | Published On Jan 11, 2026, 12.42 pm IST

RTC Bus Accident | కొర్ల‌ప‌హ‌డ్ వ‌ద్ద రెండు బ‌స్సులు ఢీ.. ప‌లురుకి గాయాలు
Advertisement

త్రినేత్ర.న్యూస్‌: న‌ల్ల‌గొండ జిల్లా కేతేప‌ల్లి మండ‌లం కొర్ల‌ప‌హాడ్ (Korlapahad) వ‌ద్ద రోడ్డు ప్ర‌మాదం (RTC Bus Accident) జ‌రిగింది. జాతీయ ర‌హ‌దారిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తిరువూరు డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సు (RTC Bus), ముందు వెళ్తున్న మ‌రో బ‌స్సును ఢీకొట్టింది. దీంతో ప‌లువురు గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ద‌వాఖానకు త‌ర‌లించారు.

ముందు వెళ్తున్న బ‌స్సు డ్రైవ‌ర్ స‌డ‌న్ బ్రేక్ వేయ‌డంతో వెనుక వ‌స్తున్న ఆర్టీసీ బ‌స్సు ఢీకొట్టిన‌ట్లు తెలుస్తున్న‌ది. అయితే బ‌స్సులు నెమ్మ‌దిగా వెళ్తుండ‌టంతో పెను ప్ర‌మాదం త‌ప్పింద‌ని పోలీసులు వెల్ల‌డించారు. గాయ‌ప‌డిన‌వారిని న‌కిరేక‌ల్ ప్ర‌భుత్వ ద‌వాఖాన‌కు త‌ర‌లించామ‌ని చెప్పారు. ప్ర‌యాణికులు స్వ‌ల్ప‌గాయాల‌తో బ‌య‌ట ప‌డ‌టంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement