త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Over Speed | అతివేగం.. అదుపుత‌ప్పి చెట్టును ఢీ కొన్న కారు.. నలుగురు విద్యార్థులు మృతి

రంగారెడ్డి జిల్లా మోకిల (Mokila) స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. గురువారం తెల్ల‌వారుజామున అతివేగంగా దూసుకొచ్చిన కారు (Over Speed) మోకిల స‌మీపంలోని మీర్జాగూడ గేటు వద్ద అదుపుత‌ప్పి చెట్టును ఢీ కొట్టింది.

G

Telangana | Published On Jan 8, 2026, 7.47 am IST

Over Speed | అతివేగం.. అదుపుత‌ప్పి చెట్టును ఢీ కొన్న కారు.. నలుగురు విద్యార్థులు మృతి
Advertisement

trinethra.news: రంగారెడ్డి జిల్లా మోకిల (Mokila) స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. గురువారం తెల్ల‌వారుజామున అతివేగంగా దూసుకొచ్చిన కారు (Over Speed) మోకిల స‌మీపంలోని మీర్జాగూడ గేటు వద్ద అదుపుత‌ప్పి చెట్టును ఢీ కొట్టింది. దీంతో నలుగురు విద్యార్థులు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుడిని హైద‌రాబాద్‌లోని ద‌వాఖాన‌కు త‌ర‌లించారు.

మృతుల్లో ముగ్గురు ఐసీఎఫ్‌ఏఐ వర్సిటీ (ICFAI University) విద్యార్థులు కాగా, మరొకరు ఎంజీఐటీకి చెందిన‌ విద్యార్థి అని పోలీసులు తెలిపారు. మృతులను సూర్యతేజ (BBA 2nd year), సుమిత్ (BBA 3rd year), శ్రీనిఖిల్‌ (BBA 3rd year), రోహిత్‌ (MGIT student)గా గుర్తించారు. నక్షత్ర (BBA 3rd year) అనే విద్యార్థిని తీవ్రంగా గాయప‌డింద‌ని చెప్పారు. వీరంతా మోకిల నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్ర‌భుత్వ ద‌వాఖాన‌కు త‌ర‌లించామ‌న్నారు. ఈ ఘ‌న‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌న్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement