త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Assembly | అసెంబ్లీకి హాజ‌రైన ఆ న‌లుగురు ఎమ్మెల్యేలు..! ఏ పార్టీ వీరిది..?

Telangana Assembly | శాస‌న‌స‌భ స‌మావేశాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. తాము ఫిరాయింపుల‌కు పాల్ప‌డ‌లేదు.. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామ‌ని ప‌దేప‌దే ఉద్ఘాటిస్తున్న ఆ న‌లుగురు ఎమ్మెల్యేల ప‌రిస్థితి విచిత్రంగా ఉంది.

S

Telangana | Published On Jan 3, 2026, 1.47 pm IST

Telangana Assembly | అసెంబ్లీకి హాజ‌రైన ఆ న‌లుగురు ఎమ్మెల్యేలు..! ఏ పార్టీ వీరిది..?
Advertisement

Telangana Assembly | త్రినేత్ర‌.న్యూస్ : శాస‌న‌స‌భ స‌మావేశాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. తాము ఫిరాయింపుల‌కు పాల్ప‌డ‌లేదు.. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామ‌ని ప‌దేప‌దే ఉద్ఘాటిస్తున్న ఆ న‌లుగురు ఎమ్మెల్యేల ప‌రిస్థితి విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఈ శాస‌న‌సభ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రిస్తున్నామ‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీ ప్ర‌క‌టించింది. ఆ ప్ర‌క‌ట‌న‌కు కట్టుబ‌డి ఇవాళ ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా స‌భ‌కు హాజ‌రు కాలేదు. కానీ పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డి కూడా బీఆర్ఎస్‌లోనే ఉంటున్న‌ట్టు ప్ర‌క‌టించిన క‌డియం శ్రీహ‌రి, తెల్లం వెంక‌ట్రావ్, దానం నాగేంద‌ర్, డాక్ట‌ర్ సంజ‌య్ శాస‌న‌స‌భ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యారు.

మ‌రి ఈ న‌లుగురు బీఆర్ఎస్ పార్టీలోనే కొన‌సాగితే.. పార్టీ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉండాలి క‌దా..? స‌భ‌కు ఎందుకు వ‌చ్చార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. అస‌లు వీరు ఏ పార్టీలో ఉన్నారో తేల్చుకోలేక‌పోతున్నార‌ని విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇవాళ స‌భ‌లో ఈ న‌లుగురు క‌నిపించ‌డంతో పార్టీ ఫిరాయింపుల‌పై మ‌రో సారి చ‌ర్చ జ‌రిగింది. అసెంబ్లీ లాబీల్లోనూ ఈ అంశంపై ప‌లువురు నాయ‌కులు గుస‌గుస‌లాడిన‌ట్లు తెలుస్తోంది.

ఇక తాను బీఆర్ఎస్‌లోనే ఉన్న‌ట్లు క‌డియం శ్రీహ‌రి ప‌లు వేదిక‌ల మీద ప్ర‌క‌టించారు. తెల్లం వెంకట్రావ్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తిస్తున్న‌ట్లు స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించారు. వీరిద్ద‌రూ కూడా ఇవాళ స‌భ‌కు వ‌చ్చారు. ఇక బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన దానం నాగేంద‌ర్, జ‌గిత్యాల ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్ సైతం స‌భ‌లో క‌నిపించారు. దానం నాగేంద‌ర్ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో లేవ‌నెత్తారు.

Advertisement

తాజావార్తలు

Advertisement