త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nizamabad | చెల్లిని కాపాడేందుకు వాగులోకి దూకిన అన్న.. చివరికి ఇద్దరూ మృతి

Nizamabad | నిజామాబాద్ (Nizamabad) జిల్లా నవీపేట్ (Navipet) మండలం జన్నేపల్లి (Jannepally) గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గణేష్ అనే యువ‌కుడు వాగులో దూకిన త‌న‌ చెల్లిని కాపాడేందుకు వెళ్లాడు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రూ ప్రాణాలు కోల్పోయారు.

D

Telangana | Published On Sep 17, 2026, 10.55 am IST

Nizamabad | చెల్లిని కాపాడేందుకు వాగులోకి దూకిన అన్న.. చివరికి ఇద్దరూ మృతి
Advertisement

Nizamabad | త్రినేత్ర‌.న్యూస్ : నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాగులో దూకి అన్నాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న నవీపేట్ (Navipet) మండలం జన్నేపల్లి (Jannepally) గ్రామంలో జ‌రిగింది. గ్రామానికి చెందిన గణేష్ (26).. త‌న‌ చెల్లి ల‌య (22) వాగువైపు వెళ్తుంద‌ని తెలుసుకుని ఆమెను అనుస‌రించాడు. అత‌ను వెళ్లే స‌రికి ల‌య వాగులోకి దూకేసింది. త‌న చెల్లిని కాపాడుకునేందుకు గ‌ణేష్ సైతం వాగులోకి దూకాడు. దురదృష్టవశాత్తూ వాగులో నీటి ఉధృతికి ఇద్ద‌రూ మునిగిపోయారు. స్థానికులు చూస్తుండ‌గానే అన్నాచెల్లెళ్లిద్దరూ నీటిలో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గ‌జ ఈత‌గాళ్ల‌ను రంగంలోకి దింపారు. గ‌ణేష్‌, ల‌య కోసం వాగు మొత్తం జ‌ల్లెడ ప‌ట్టించారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మృత‌దేహాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. గ‌ణేష్ హైద‌రాబాద్‌లో ఓ ప్రైవేటు సంస్థ‌లో ఉద్యోగం చేస్తున్న‌ట్లు తెలిసింది. ల‌య డిగ్రీ పూర్తి చేసి ప్ర‌స్తుతం ఇంటి వ‌ద్దే ఉంటున్న‌ట్లు స‌మాచారం. ఆమె వాగులోకి దూక‌డానికి గ‌ల కార‌ణాలు తెలియరాలేదు. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అల‌ముకున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Also Read..

ఫెడ్‌ రేట్‌ పెంపుతోనూ లాభాల్లో భారత మార్కెట్లు.. నిఫ్టీ 23,300 పైన..

పెళ్లి సామాన్లు తీసుకొస్తూ.. మృత్యుఒడిలోకి తండ్రీకుమార్తె

రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర ఎస్‌ఐ, సీఐ

Advertisement
Advertisement