Elephants | వైల్డ్లైఫ్ క్యాంప్లో ఏనుగుల మధ్య ఘర్షణ.. వాటి మధ్యన నలిగి మహిళా టూరిస్ట్ మృతి
Elephants | సరదాగా వైల్డ్లైఫ్ క్యాంప్కు (Karnataka Wildlife Camp) వెళ్లిన ఓ కుటుంబానికి ఊహించని అనుభవం ఎదురైంది. రెండు ఏనుగుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.
Elephants | సరదాగా వైల్డ్లైఫ్ క్యాంప్కు (Karnataka Wildlife Camp) వెళ్లిన ఓ కుటుంబానికి ఊహించని అనుభవం ఎదురైంది. రెండు ఏనుగుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో అక్కడికి వచ్చిన పర్యాటకులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటన కర్ణాటకలోని కొడగు (Kodagu) జిల్లాలో చోటు చేసుకుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. చెన్నై (Chennai)కి చెందిన 33 ఏళ్ల జ్యునేష్ (Jyunesh) అనే మహిళ ఫ్యామిలీతో కలిసి సరదాగా దుబేరా ఏనుగుల క్యాంప్కు వెళ్లింది. అక్కడికి వచ్చిన పర్యాటకులంతా ఏనుగులకు స్నానం చేయించడాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఆ సమయంలో 'కాంచన', 'మార్తాండ' అనే రెండు ఏనుగుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మార్తాండపై కాంచన విరుచుకుపడింది. వీటి మధ్య ఘర్షణను అదుపు చేసేందుకు మావటిలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వాటి మధ్య పోరు అలాగే కొనసాగింది. కాసేపటికి ఓ ఏనుగు నియంత్రణ కోల్పోయి అక్కడే ఉన్న జ్యునేష్పై పడింది. ఆ ఏనుగు పైకి లేచే క్రమంలో మహిళను తీవ్రంగా తొక్కేసింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో సరదాగా సాగిన వీరి విహారం విషాదంతో ముగిసింది.
ఈ ఘటనపట్ల కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతాలు, వైల్డ్లైఫ్ క్యాంపుల్లో పర్యాటకుల రక్షణ కోసం కఠినమైన భద్రతా నిబంధనలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యాటకులు ఏనుగుల తొండాలను తాకడం, వాటికి చాలా దగ్గరగా నిలబడి ఫోటోలు దిగడం, ఏనుగులకు స్నానం చేయించడం, వాటికి ఆహారం తినిపించడం వంటివి చేయకుండా నిరోధించాలని అధికారులకు సూచించారు.
Graphic warning - Wild Animals aren’t entertainment. A domestic tourist in India lost her life after two elephants started to fight at an Elephant Camp. pic.twitter.com/iRq9VFpXdN
— G̲r̲e̲e̲n̲ C̲o̲a̲l̲i̲t̲i̲o̲n̲ N̲e̲t̲w̲o̲r̲k̲ ™ 🌏 (@greencoalition) May 18, 2026
Also Read..
కేరళం కేబినెట్లో అత్యంత సంపన్నుడు ఆయనే.. 68 కేసులతో ఆ నేతే టాప్..!
యూఏపీఏ కేసుల్లోనూ బెయిల్ ఇవ్వొచ్చు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






