President Droupadi Murmu | ప్రొటోకాల్ వివాదం.. తృణమూల్ నేతలకు అపాయింట్మెంట్ నిరాకరించిన రాష్ట్రపతి ముర్ము
President Droupadi Murmu | అసెంబ్లీ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ బృందానికి తీవ్ర నిరాశ ఎదురైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును (President Droupadi Murmu) కలిసేందుకు అపాయింట్మెంట్ కోరగా అందుకు కార్యాలయం నిరాకరించింది.
President Droupadi Murmu | అసెంబ్లీ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ బృందానికి తీవ్ర నిరాశ ఎదురైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును (President Droupadi Murmu) కలిసేందుకు అపాయింట్మెంట్ కోరగా అందుకు కార్యాలయం నిరాకరించింది. సమయాభావం కారణంగా అపాయింట్మెంట్ ఇవ్వలేమని స్పష్టం చేసినట్లు శుక్రవారం ఉదయం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కాగా, పశ్చిమబెంగాల్లో గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించేందుకు 12 మంది సభ్యుల టీఎంసీ ప్రతినిధి బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ కోరింది. ఈ మేరకు ఈనెల 9న రాష్ట్రపతి కార్యాలయానికి లేఖ రాసింది. అయితే, అందుకు రాష్ట్రపతి కార్యాలయం నిరాకరించింది. దీంతో వచ్చే వారం అయినా అవకాశం ఇవ్వాలని వారు మరో లేఖను రాష్ట్రపతి కార్యాలయానికి పంపినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. అయితే, దీనిపై ఇప్పటి వరకూ వారికి ఎలాంటి సమాచారం లేదని టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ తెలిపారు.
బెంగాల్ ప్రభుత్వంపై రాష్ట్రపతి అసహనం..
ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెంగాల్ పర్యటనలో ప్రొటోకాల్ (Protocol) ఉల్లంఘన జరిగిన విషయం తెలిసిందే. 9వ అంతర్జాతీయ సంతాల్ సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్రపతి సిలిగుడికి వెళ్లిన సమయంలో ప్రొటోకాల్ ఉల్లంఘన చోటు చేసుకుంది. ఈ ఘటనపై రాష్ట్రపతి ముర్ము తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. తాను బాగ్డోగ్రా ఎయిర్పోర్టుకు చేరుకున్నప్పుడు ముఖ్యమంత్రి గానీ, కేబినెట్ మంత్రులు గానీ ఎందుకు రాలేదని ముర్ము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతేకాదు, కార్యక్రమ వేదికను మార్చడంపై కూడా అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గిరిజనులకు చేరకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
"ఇక్కడ సంతాల్స్, గిరిజప ప్రజల కోసం అభివృద్ధి జరుగుతోందా..? నేనైతే అలా అనుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం పథకాలు మీకు అందుతున్నాయా..? కొంతమందిని ఇక్కడికి రాకుండా అడ్డుకుంటున్నారని నేను భావిస్తున్నాను. బహుశా సంతాల్స్ అభివృద్ధి చెందడం ఇక్కడ కొంతమందికి ఇష్టం లేదేమో" అని ముర్ము తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఇక ప్రొటోకాల్ ఉల్లంఘనపై కేంద్ర హోంశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ నేతలు సైతం దీదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తృణమూల్ నేతలకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ నిరాకరించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
https://x.com/ANI/status/2030244746413637697
Also Read..
ఈ రోజు ఏం జరుగుతుందో చూడండి.. వారిని అంతం చేస్తున్నా.. ఇరాన్కు ట్రంప్ సీరియస్ వార్నింగ్
ఎమ్జీఆర్పై అనుచిత కామెంట్ల వివాదం - క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
ఐక్యూ నుంచి జడ్11ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్.. భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లే..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Supreme Court | సుప్రీంకోర్టులో జడ్జిల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం.. 34 నుంచి 38కి పెరుగనున్న సంఖ్య
మే 17, 2026

Mamata Banerjee | పార్టీని వీడాలనుకునేవారు స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చు : మమతా బెనర్జీ
మే 16, 2026

Mamata Banerjee | మరోసారి లాయర్ అవతారమెత్తిన మమతా బెనర్జీ.. కేసు వాదించేందుకు నల్లకోటు ధరించి కోర్టుకు వెళ్లిన దీదీ
మే 14, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



