Paper Leak | ఉపాధ్యాయ నియామక పరీక్ష పేపర్ లీక్.. 30 మంది అభ్యర్థుల నుంచి 1.2 కోట్లు వసూలు చేసిన డాక్టర్..
aper Leak | బీహార్లో ఉపాధ్యాయ నియామక పరీక్ష (Teacher Recruitment) పేపర్ లీక్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ను ఆర్థిక నేరాల విభాగం (EOU) అరెస్టు చేసింది. తన సహచరులతో కలిసి పేపర్ను లీక్ (Paper Leak) చేసిన డాక్టర్.. మొత్తం 30 మంది అభ్యర్థుల నుంచి పెద్దమొత్తంలో వసూలు చేసినట్లు తేలింది.
Paper Leak | త్రినేత్ర.న్యూస్: బీహార్లో ఉపాధ్యాయ నియామక పరీక్ష (Teacher Recruitment) పేపర్ లీక్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ను ఆర్థిక నేరాల విభాగం (EOU) అరెస్టు చేసింది. తన సహచరులతో కలిసి పేపర్ను లీక్ (Paper Leak) చేసిన డాక్టర్.. మొత్తం 30 మంది అభ్యర్థుల నుంచి పెద్దమొత్తంలో వసూలు చేసినట్లు తేలింది.
2024 మార్చి 15న బీహార్లో టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష (BPSC TRE) జరగాల్సి ఉన్నది. అయితే దానికి ఒకరోజు ముందే పరీక్ష పేపర్ లీక్ అయినట్లు, ప్రశ్నపత్రాలు కొందరు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినట్లు EOU గుర్తించింది. దీంతో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) పరీక్షను రద్దు చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన ఈఓయూ.. డాక్టర్ మనీశ్ కుమార్ (Dr Manish Kumar) అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించింది. తన సహచరులైన డాక్టర్ శివ్, డాక్టర్ శుభంతో కలిసి ఈ వ్యవహారం నడిపినట్లు తేల్చింది. పరీక్ష ముందు 30 మంది అభ్యర్థులకు ప్రశ్నపత్రాలు అందించి, వారి నుంచి సుమారు రూ.1.2 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించింది. ప్రతి అభ్యర్థి నుంచి రూ.50 వేలు తీసుకున్నట్లు తేల్చింది.
పరీక్షకు ఒక రోజు ముందే..
పరీక్షకు ఒక రోజు ముందే అంటే 2024, మార్చి 14న పాట్నాలోని ఓ హోటల్లో 30 మంది అభ్యర్థులకు బస ఏర్పాటు చేశారు. వారికి ప్రశ్నపత్రాలను అందజేశారు. అయితే పేపర్లీక్కు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు మార్చి 14న భాబువాలోని కోహినూర్ హోటల్పై (Kohinoor Hotel) దాడిచేశారరు. అయితే అప్పటికే మనీశ్ కుమార్ అక్కడినుంచి తప్పించారు. దీంతో హోటల్ సీసీటీవీ ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాలతో మనీశ్ కుమార్ను పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి మనీశ్ పరారీలో ఉన్నాడు.
తాజాగా పాట్నా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (పీఎంసీహెచ్), నలంద మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (ఎన్ఎంసీహెచ్) విద్యార్థుల డేటా ఆధారంగా అతడిని గుర్తించి అరెస్టు చేశారు. అతడు పేపర్ లీక్ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సంజీవ్ ముఖియా కుమారుడని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 296 మందిని అరెస్ట్ చేశారు.
సంబంధిత వార్తలు

Akhilesh Yadav | మోదీని కాపాడేందుకే ప్రధాన్ను తొలగించారు : అఖిలేష్ యాదవ్
జులై 28, 2026

Gaurav Gogoi | ధర్మేంద్ర ప్రధాన్కు పూలమాలలతో సత్కారమా..? ఆయనేమైనా పాకిస్థాన్పై యుద్ధం గెలిచొచ్చారా..? : గౌరవ్ గొగోయ్
జులై 28, 2026

Anti Paper Leak Bill | యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రేపు లోక్సభలో చర్చ.. అనంతరం ఓటింగ్
జులై 27, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు లక్కీ చాన్స్..
- ●Bogatha Waterfalls | ఉప్పొంగుతున్న బొగత జలపాతం.. పర్యాటకుల సందర్శన నిలిపివేత
- ●Stock Markets | 700 పాయింట్లకు పైగా దూసుకెళ్లిన సెన్సెక్స్.. 24,200 దాటిన నిఫ్టీ..
- ●Misir Besra | మావోయిస్టు పొలిట్బ్యూరోలో చివరి క్రియాశీలక నేత అరెస్ట్..
- ●Land Grabbed | రూ.60 కోట్ల విలువైన ఆలయ భూములు అన్యాక్రాంతం.. తహశీల్దార్ సహా 19 మందిపై కేసు
- ●Manhole | మియాపూర్లో విషాదం.. మ్యాన్ హోల్లో పడి వ్యక్తి గల్లంతు

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు లక్కీ చాన్స్..

Bogatha Waterfalls | ఉప్పొంగుతున్న బొగత జలపాతం.. పర్యాటకుల సందర్శన నిలిపివేత

Stock Markets | 700 పాయింట్లకు పైగా దూసుకెళ్లిన సెన్సెక్స్.. 24,200 దాటిన నిఫ్టీ..

Misir Besra | మావోయిస్టు పొలిట్బ్యూరోలో చివరి క్రియాశీలక నేత అరెస్ట్..



