Sonia Gandhi | ఖమేనీ హత్యపై మౌనం ఎందుకు..? ఇదేనా మీ విదేశాంగ విధానం..? కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన సోనియా గాంధీ
Sonia Gandhi | ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మరణంపై కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీరుపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Sonia Gandhi | ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మరణంపై కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీరుపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఖమేనీ మరణంపై మౌనంగా ఉండటం అంటే తటస్థంగా ఉండటం కాదని.. అది బాధ్యత నుంచి తప్పుకోవడమే అని వ్యాఖ్యానించారు. టెహ్రాన్తో న్యూఢిల్లీకి ఉన్న సంబంధాలు సాంస్కృతికమైన, వ్యూహాత్మకమైనవని ఆమె పేర్కొన్నారు.
"ఇజ్రాయెల్-అమెరికా జరిపిన దాడుల్లో తమ నాయకుడు ఖమేనీ మరణించినట్లు ఇరాన్ ధృవీకరించింది. చర్చలు జరుగుతున్న సమయంలో ఓ దేశాధినేతను హత్య చేయడం సమకాలీన అంతర్జాతీయ సంబంధాల్లో తీవ్ర చీలికను సూచిస్తుంది. ఖమేనీ మరణంపై ఢిల్లీ ఎందుకు మౌనంగా ఉంది..? మొదట్లో అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన భారీ దాడులను విస్మరించి ప్రధాని మోదీ (PM Modi) కేవలం యూఏఈపై ఇరాన్ జరిపిన ప్రతీకార దాడులను ఖండించడానికే పరిమితమయ్యారు. ఆ దాడులకు దారితీసిన పరిస్థితులను ఆయన ప్రస్తావించలేదు. ఆ తర్వాత తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. చర్చలు, దౌత్యం గురించి మాట్లాడారు. కానీ, అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరగకముందు ఇక్కడ జరుగుతున్నది కూడా చర్చలే కద. ఓ విదేశీ నేతను లక్ష్యంగా చేసుకొని చేసిన హత్యపై భారత్ మౌనం వహించడం తటస్థం కాదు. అది మన విదేశీ విధానం యొక్క విశ్వసనీయతను దెబ్బతీసే బాధ్యతా రాహిత్యం. ఇది మన విదేశాంగ విధానం యొక్క దిశ, విశ్వసనీతపై తీవ్రమైన సందేహాలు తలెత్తుతున్నాయి" అని సోనియా వ్యాఖ్యానించారు.
నెతన్యాహు ప్రభుత్వానికి నిస్సందేహంగా మద్దతు అంటే..
మరోవైపు ఖమేనీ హత్యకు కేవలం 48 గంటల ముందే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగించుకొని రావడాన్ని కూడా ప్రస్తావించారు. గాజా యుద్ధంలో మహిళలు, పిల్లలు సహా పెద్ద సంఖ్యలో పౌరులు మరణించడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నప్పటికీ.. మన ప్రధాని మాత్రం నెతన్యాహు ప్రభుత్వానికి నిస్సందేహంగా మద్దతు ఇవ్వడం మరింత ఆందోళన కలిగిస్తోందని సోనియా వ్యాఖ్యానించారు. 2001 ఏప్రిల్లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయీ టెహ్రాన్ పర్యటన నుంచి ఇరాన్తో భారత్కు ఉన్న నాగరిక, సమకాలీన సంబంధాలను ప్రస్తుత ప్రభుత్వం గుర్తుంచుకోవడం మంచిదని సోనియా గాంధీ సూచించారు. అటు ఇజ్రాయెల్తో భారత్ సంబంధాలు ఇటీవలి కాలంలో రక్షణ, వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానం అంతటా విస్తరించాయని పేర్కొన్నారు.
వసుధైక కుటుంబం అనేది ప్రసంగాలకే పరిమితం కాకూడదు..
భారత్కు టెహ్రాన్తో పాటు టెల్ అవీవ్కు దౌత్యపరమైన స్వేచ్ఛ ఉందని, అది విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుందని అన్నారు. వసుధైక కుటుంబం అనేది కేవలం ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాకూడదని సోనియా వ్యాఖ్యానించారు. న్యాయం, శాంతి కోసం నిలబడటమే దాని అర్థమని పేర్కొన్నారు. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సమయంలో అంతర్జాతీయ సమస్యలపై తప్పనిసరిగా చర్చించాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు.
కాగా, ఖమేనీ మరణంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. కానీ మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. భారత్ ఎప్పటికీ శాంతినే కోరుకుంటుందన్నారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని వ్యాఖ్యానించారు.
Also Read..
హర్ముజ్లోకి నౌకలు వస్తే తగలబెడతాం : ఇరాన్
యుద్ధం, ఉద్రిక్తతలు నెలకొన్నా.. కాస్త తగ్గిన బంగారం ధరలు..
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






