త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samvidhan Bachao | విద్యా వ్య‌వ‌స్థ‌లో అవ‌క‌త‌వ‌క‌లు.. జులై 20న 12 గంట‌ల శాంతియుత‌ నిరాహార దీక్ష చేప‌ట్టండి

Samvidhan Bachao | నీట్ కుంభకోణం వల్ల కొనసాగుతున్న పరిణామాలు లక్షలాది మంది నిజాయితీగల విద్యార్థుల (students) కలలను ఛిన్నాభిన్నం చేశాయ‌ని సంవిధాన్ బ‌చావో సంఘ‌ర్ష్ స‌మితి (Samvidhan Bachao Sangharsh Samiti) ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

D

National | Published On Jul 17, 2026, 3.21 pm IST

Samvidhan Bachao | విద్యా వ్య‌వ‌స్థ‌లో అవ‌క‌త‌వ‌క‌లు.. జులై 20న 12 గంట‌ల శాంతియుత‌ నిరాహార దీక్ష చేప‌ట్టండి
Advertisement

Samvidhan Bachao | నీట్ కుంభకోణం వల్ల కొనసాగుతున్న పరిణామాలు లక్షలాది మంది నిజాయితీగల విద్యార్థుల (students) కలలను ఛిన్నాభిన్నం చేశాయ‌ని సంవిధాన్ బ‌చావో సంఘ‌ర్ష్ స‌మితి (Samvidhan Bachao Sangharsh Samiti) ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు దేశ విద్యా వ్య‌వ‌స్థ‌లో జ‌రుగుతున్న అవ‌క‌త‌వ‌క‌ల‌పై దేశ వ్యాప్త నిర‌స‌న‌కు పిలుపునిచ్చింది. జులై 20వ తేదీన దేశ వ్యాప్తంగా 12 గంట‌ల పాటూ నిరాహార దీక్ష చేప‌ట్టాల‌ని యువ‌త‌, విద్యార్థుల‌కు సూచించింది. సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కూ న్యూఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద జ‌రిగే నిర‌స‌న‌ల్లో పాల్గొనాల‌ని పిలుపునిచ్చింది.

అదేవిధంగా దేశ‌వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, విద్యా కేంద్రాల వ‌ద్ద‌ ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కూ శాంతియుతంగా నిరాహార దీక్ష చేపట్టండి అంటూ పిలుపునిచ్చింది. దేశ విద్యా వ్య‌వ‌స్థ‌లో వైఫ‌ల్యానికి నైతిక బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ని త‌క్ష‌ణ‌మే ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని, ప‌రీక్ష‌ల స‌మ‌గ్ర‌త‌లో జ‌రిగిన భారీ లోపాల‌పై నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ అధిప‌తి ప్ర‌దీప్ జోషిని అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేసింది. అంతేకాదు, నీట్ ప‌రీక్ష‌ల్లో అవ‌క‌త‌వ‌క‌ల కార‌ణంగా తీవ్ర మ‌నోవేద‌న‌కు గురై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాల‌కు ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే రూ.1కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాల‌ని డిమాండ్ చేసింది.

Also Read..

యాపిల్ బ్యాక్ టు స్కూల్ ఆఫర్.. మాక్ కొంటే ఉచిత ఎయిర్‌పాడ్స్..

ఏం జ‌రిగినా.. జులై 20 వరకూ ప్రాణాల‌తో ఉంటా : సోన‌మ్ వాంగ్‌చుక్‌

యువ సంగ్రామ స‌భ‌కు ఎందుకు అనుమ‌తివ్వ‌రు.. ఎన్ని అడ్డంకులున్నా స‌క్సెస్ చేస్తం

Advertisement
Advertisement