త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | హుగ్లీ న‌దిలో ప్ర‌ధాని మోదీ ప‌డ‌వ ప్ర‌యాణం.. ఫొటోలు

PM Modi | అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా హుగ్లీ న‌దీ (Hooghly river) తీరాన ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణాన్ని ప్ర‌ధాని ఆస్వాదించారు.

D

National | Published On Apr 24, 2026, 10.55 am IST

PM Modi | హుగ్లీ న‌దిలో ప్ర‌ధాని మోదీ ప‌డ‌వ ప్ర‌యాణం.. ఫొటోలు
Advertisement

PM Modi | అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా హుగ్లీ న‌దీ (Hooghly river) తీరాన ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణాన్ని ప్ర‌ధాని ఆస్వాదించారు. న‌దిలో ప‌డ‌వ ప్ర‌యాణం (boat ride) చేశారు. హౌరా బ్రిడ్జ్ (Howrah Bridge) అందాల‌ను తిల‌కించారు. అంద‌మైన దృశ్యాల‌ను త‌న కెమెరాలో బంధించారు. ఈ సందర్భంగా తీరంలోని మత్స్యకారులు, మార్నింగ్ వాక్‌కు (morning walkers) వ‌చ్చిన వారితో మోదీ సరదాగా ముచ్చటించారు. ప్ర‌ధానిని చూసిన స్థానికులు ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. ఆయ‌న‌తో మాట్లాడేంద‌కు పోటీ ప‌డ్డారు.

ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను ప్ర‌ధాని మోదీ త‌న ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. “ప్రతి బెంగాలీ మనసులో గంగానదికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఉద‌యం హుగ్లీ న‌ది ఒడ్డున కొంత స‌మ‌యం గ‌డిపాను. గంగామాతకు కృతజ్ఞతలు తెలిపే అవకాశం రావడం నా అదృష్టం” అని మోదీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. గురువారం రోడ్‌షోలో హౌరా బ్రిడ్జ్‌పై వెళ్లిన ప్రధాని మోదీ, నేడు నదిపై నుంచి ఆ వంతెన అపురూప దృశ్యాన్ని వీక్షించడం విశేషం.

Also Read..

మ‌న దేశంలో అతిపెద్ద రైల్వే స్టేష‌న్ ఏదో తెలుసా..?

నెల‌కు రూ.1000 సిప్ (SIP) వేస్తే రూ.15 ల‌క్ష‌లు రాబ‌డి.. మార్కెట్ ఎలా ఉన్నా లాభం ప‌క్కా..

ముత్తోజిపేటకు ఆర్టీసీ డ్రైవ‌ర్‌ శంకర్‌గౌడ్‌ మృతదేహం.. మధ్యాహ్నం అంత్యక్రియలు

Advertisement
Advertisement