త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shankar Goud | ముత్తోజిపేటకు ఆర్టీసీ డ్రైవ‌ర్‌ శంకర్‌గౌడ్‌ మృతదేహం.. మధ్యాహ్నం అంత్యక్రియలు

Shankar Goud | త్రినేత్ర‌.న్యూస్‌: ఆర్టీసీ సమ్మె (RTC Strike) నేపథ్యంలో ఆత్మహ‌త్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్‌ కోల శంకర్‌గౌడ్‌ (Shankar Goud) మృతదేహం తన అల్లుడి స్వగ్రామానికి చేరుకుంది. వరంగల్‌ జిల్లా నర్సంపేట (Narsampet) మండలం ముత్తోజిపేటకు ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు.

G

News | Published On Apr 24, 2026, 10.23 am IST

Shankar Goud | ముత్తోజిపేటకు ఆర్టీసీ డ్రైవ‌ర్‌ శంకర్‌గౌడ్‌ మృతదేహం.. మధ్యాహ్నం అంత్యక్రియలు
Advertisement

Shankar Goud | త్రినేత్ర‌.న్యూస్‌: ఆర్టీసీ సమ్మె (RTC Strike) నేపథ్యంలో ఆత్మహ‌త్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్‌ కోల శంకర్‌గౌడ్‌ (Shankar Goud) మృతదేహం తన అల్లుడి స్వగ్రామానికి చేరుకుంది. వరంగల్‌ జిల్లా నర్సంపేట (Narsampet) మండలం ముత్తోజిపేటకు ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. శుక్ర‌వారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.

స‌మ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు గురువారం రాష్ట్ర‌వ్యాప్తంగా నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో న‌ర్సంపేట డిపోలో డ్రైవ‌ర్ శంక‌ర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకున్నారు. దీంతో 80 శాతం కాలిపోవ‌డంతో, మెరుగైన చికిత్స కోసం ఆయ‌న‌ను హైద‌రాబాద్‌లోని డీఆర్డీవో అపోలో ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. అయితే అక్క‌డ చికిత్స పొందుతూ శుక్ర‌వారం తెల్ల‌వారుజామున మృతిచెందారు. దీంతో పోస్టుమార్టం పూర్తి చేసి, ఆయ‌న మృత‌దేహాన్ని ముత్తోజీపేట‌కు పోలీసులు బందోబ‌స్తుతో పంపించారు.

కాగా, ప్రభుత్వంతో చర్చలకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ వెంకన్న తెలిపారు. శంకర్‌గౌడ్‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ద్వితీయశ్రేణి జేఏసీ నేతలు వెళ్తారన్నారు. సచివాలయంలో ఉదయం 10 గంటలకు ఉద్యోగ సంఘాలతో సీనియర్‌ ఐఏఎస్ కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. తొలుత ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ కమిటీ సమావేశమవుతుంది. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కానున్నారు.

 

Advertisement
Advertisement