త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | రాత్రి 8:30 గంట‌ల‌కు జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాని మోదీ

PM Modi | ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) నేడు జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. రాత్రి 8:30 గంట‌ల‌కు ప్ర‌ధాని మాట్లాడ‌తార‌ని ఆయ‌న కార్యాల‌యం అధికారికంగా ప్ర‌క‌టించింది.

D

National | Published On Apr 18, 2026, 3.02 pm IST

PM Modi | రాత్రి 8:30 గంట‌ల‌కు జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) నేడు జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. రాత్రి 8:30 గంట‌ల‌కు ప్ర‌ధాని మాట్లాడ‌తార‌ని ఆయ‌న కార్యాల‌యం అధికారికంగా ప్ర‌క‌టించింది. అయితే, ఏ అంశంపై ప్ర‌ధాని మాట్లాడ‌తార‌నేదానిపై ఎలాంటి స‌మాచారం పంచుకోలేదు. లోక్‌స‌భ‌లో కేంద్రం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించిన రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు వీగిపోయిన నేప‌థ్యంలో ప్ర‌ధాని ప్ర‌సంగం (PM Modi To Address Nation) ఉండ‌టం ప్రాధాన్యత‌ను సంత‌రించుకుంది. ఆయ‌న ఏ అంశంపై మాట్లాడ‌తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

మహిళా రిజర్వేషన్ల (Women's Reservation) అమలును వేగవంతం చేయడంతో పాటు, కొత్త జనాభా లెక్కల అవసరం లేకుండానే డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) చేపట్టేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కీలక బిల్లు వీగిపోయింది. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో ఎన్డీయే (NDA) కూటమికి అవసరమైన మూడింట రెండొంతుల (2/3rd) మెజారిటీ రాకపోవడంతో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ముందుకు సాగలేదు. బిల్లు ఆమోదం పొందాలంటే మొత్తం 326 ఓట్లు అవసరం. అయితే ఓటింగ్‌లో మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొనగా, బిల్లుకు అనుకూలంగా కేవలం 298 ఓట్లు మాత్రమే వచ్చాయి. బిల్లుకు వ్యతిరేకంగా 230 మంది ఎంపీలు ఓటు వేశారు. అవసరమైన సంఖ్యాబలం రాకపోవడంతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఈ బిల్లును లోక్‌సభ నుంచి ఉపసంహరించుకున్నారు.

విపక్షాలు క్ష‌మించ‌రాని తప్పు చేశాయి..

ఇవాళ జ‌రిగిన కేంద్ర కేబినెట్ స‌మావేశంలో రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు లోక్‌స‌భ‌లో వీగిపోవ‌డంపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేర‌కు ప్ర‌తిప‌క్షాల‌పై (opposition) తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఈ బిల్లుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా విప‌క్షాలు క్ష‌మించ‌రాని త‌ప్పు (unforgivable mistake) చేశాయ‌ని వ్యాఖ్యానించారు. వారు దీనికి త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. "ఈ బిల్లును వ్య‌తిరేకించి విప‌క్ష ఎంపీలు క్ష‌మించ‌రాని త‌ప్పు చేశారు. వారు మ‌హిళ‌ల‌ను నిరాశ‌ప‌రిచారు. అందుకు మ‌హిళ‌ల‌కు వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. ఈ బిల్లును అంగీకరించనివారు తమ తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు" అని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు.

Also Read..

ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం.. డీఏ 2 శాతం పెంపు

మోదీ ప్ర‌భుత్వానికి చీక‌టి రోజు.. ఈ ఫ‌లితం విప‌క్షాల ఐక్య‌త‌కు నిద‌ర్శ‌నం.. రిజ‌ర్వేష‌న్ల బిల్లు వీగిపోవ‌డంపై ప్రియాంక గాంధీ

యూట్యూబ్ షార్ట్స్ కు కొత్త అప్‌డేట్‌.. వీడియోల‌ను అస‌లు చూడ‌కుండా ఆపొచ్చు..

Advertisement
Advertisement